Search Here

Sep 6, 2021

William Elmslie | విలియం ఎల్మ్ స్లీ

విలియం ఎల్మ్ స్లీ | William Elmslie

  • జననం: 29-06-1832
  • మహిమ ప్రవేశం: 18-11-1872
  • స్వస్థలం: అబెర్డీన్
  • దేశం: స్కాట్లాండు
  • దర్శన స్థలము: భారతదేశం


 ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశంలో కాశ్మీర్ ఒక రాచరిక రాష్ట్రముగా ఉండేది. ఆనాటి మహారాజులు మిషనరీ కార్యకలాపాలను ఏమాత్రం సహించేవారు కాదు. అయితే రణబీర్ సింగ్ మహారాజు సింహాసనాన్ని అధిరోహించిన తరువాత తన ప్రజలకు ఆధునిక వైద్యం అవసరమని భావించి, వేసవికాలములో మిషనరీలు అక్కడికి వచ్చుటకు అనుమతించారు. ఆ విధముగా కాశ్మీర్‌లో సేవ చేయుటకు వచ్చిన మొట్టమొదటి మిషనరీలలో జాక్సన్ ఎల్మ్ స్లీ ఒకరు. 


 ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందారు ఎల్మ్ స్లీ. ‘చర్చి మిషనరీ సొసైటీ’ యొక్క అభ్యర్థన మేరకు అతను వెంటనే భారతదేశంలో సేవ చేయుటకు పయనమయ్యారు. 1864వ సంll లో కాశ్మీర్ చేరుకొనిన అతను, అక్కడి సాధారణ ప్రజల పరిస్థితి చూసి ఆందోళన చెందారు. ఏలయనగా కాశ్మీర్ తన ప్రకృతి సౌందర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ, పేదరికం మరియు భయంకరమైన వ్యాధులలో చిక్కుకొనియుంది. అంతగా శ్రమ లేకుండానే, ఎల్మ్ స్లీ వెంటనే స్థానిక ప్రజల కొరకు ఒక ఔషధశాలను తెరిచి వారికి చికిత్స చేయడం ప్రారంభించారు. పాశ్చాత్య ఔషధములను వాడుటకు ప్రజలు మొదటిలో సంకోచించినప్పటికీ, త్వరలోనే వందలాది మంది వైద్యసహాయం కొరకు ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. పరిస్థితులకు తగినట్లుగానే ఎల్మ్ స్లీ కూడా కొన్ని ముఖ్యమైన వైద్య పరిశోధనలు చేసి, మరణాంతకమైన ‘కాశ్మీర్ క్యాన్సర్‌’ వ్యాధిని గుర్తించారు.


 తాను వేసవిలో మాత్రమే పని చేయుటకు అనుమతించబడినందున శీతాకాలంలో అతను తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు. అయితే పట్టువదలని ఈ మిషనరీ వైద్యుడు మరుసటి వేసవిలో మరలా కాశ్మీర్‌కు వచ్చారు. ఆ విధంగా అతను 1872వ సంll వరకు కాశ్మీర్‌లో సేవలందించుటను కొనసాగించారు. అందునుబట్టి ఎల్మ్ స్లీ కాశ్మీర్ ప్రజలకు చెప్పినది ఏమంటే అతను మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చుటకు కారణం యేసు క్రీస్తు ప్రభువని. అతను సువార్తను ప్రకటించి అనేకమంది కాశ్మీర్‌ ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు. కాగా మతమార్పిడుల గురించి తెలుసుకొనిన మహారాజు అతని పనిని నిలిపివేయవలెనని ఎల్మ్ స్లీని బెదిరించారు. అతను తన మిషనరీ పనిని ఆపివేసి కేవలం వైద్య సేవలనందించుటపై మాత్రమే దృష్టి నిలిపినట్లయితే ధనమిస్తానని ఒకసారి రాజు అతనికి ఆశ చూపారు కూడా. అటువంటి పరిస్థితులన్నింటి మధ్యలో కూడా అతను ఏనాడూ వైద్య సేవలను సువార్త నుండి వేరుపరచలేదు. అక్కడి స్థానికులు ఆప్యాయంగా అతనిని “పాద్రి డాక్టర్ సాహెబ్” అని పిలిచేవారు. 


 1872వ సంll లో తన భార్యతో కలిసి ఎల్మ్ స్లీ శ్రీనగర్ నుండి ఆలస్యంగా బయలుదేరగా, వారు మంచులో చిక్కుకుపోయారు. అతనిని కాపాడుటకు అతని భార్య ఎంతగానో పోరాడినప్పటికీ, అప్పటికే అనారోగ్యంతో ఉన్న అతని శరీరం ఆ చలిని తట్టుకొనలేకపోయింది. 1872వ సంll నవంబరు మాసంలో దేవునికి నమ్మకమైన ఈ పరిచారకుడు మహిమలోకి ప్రవేశించగా, అతని భార్య మార్గరెట్ అతను విడిచిపెట్టిన ఆ మంచి పనిని 1878వ సంll వరకు కొనసాగించారు.


🚸 *ప్రియమైనవారలారా, అన్యజనుల కొరకు పనిచేయుటకు క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతం చేయుచున్నదా?* 🚸


🛐 *"ప్రభువా, నా వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురైనప్పటికీ, మిమ్ములను సేవించుటలో ఎల్లప్పుడూ ఆనందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

******

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • No comments:

    Post a Comment