Search Here

Aug 2, 2021

Arthur Margoschis | ఆర్థర్ మార్గోస్చిస్

ఆర్థర్ మార్గోస్చిస్ | Arthur Margoschis

జననం : 24-12-1852
మరణం : 27-04-1908
స్వస్థలం : లీమింగ్టన్
దేశం : ఇంగ్లాడు
దర్శన స్థలము : భారత దేశం
బెంజమిన్ హెన్రీ ఆర్థర్ మార్గోస్చిస్ విదేశాలలో సువార్త ప్రచారం చేయు సమాజం - సొసైటీ ఫర్ ద ప్రోపగేషన్ అఫ్ ద గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్ ( ఎస్ పి జి ) తరుపున భారత దేశానికి వచ్చిన సంస్కరణోద్యమ మిషనరీ. ఆర్థర్ తన వైద్య డిగ్రీ యొక్క చివరి సంవత్సరం అభ్యసిస్తున్నప్పుడు, రాబర్ట్ కాల్డ్వెల్ భారతదేశంలో పరిచేర్య చేయుటకు గాను యువకుల అత్యావశ్యకత గురించి మాట్లాడటం వినిన వెంటనే అతను భారతదేశంలో మిషనరీగా పని చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. ఆర్థర్ కుటుంబసభ్యులు మరియు స్నేహితులు తొందరపడి నిర్ణయం తీసుకొనవద్దని మొదట డిగ్రీ పూర్తి చేయమని సలహా ఇచ్చినప్పుడు "ఇది నా స్వంత సౌలభ్యం కొరకు నేను చేయగలిగే పని కాదు" అని చెప్పారు. ఆర్థర్ 1875 వ సం|| లో తమిళనాడు చేరుకొని, తమిళంలో నైపుణ్యం సంపాదించేవరకు కాల్డ్వెల్ తో కలిసి ఉన్నారు. తరువాత 1876 వ సం|| లో తిరునెల్వేలి జిల్లాలోని నజరేతు అను ఒక కుగ్రామానికి పంపబడ్డారు.
ఆర్థర్ తన మిషనరీ పని లో ఎంతో ఉత్సాహంతో కొనసాగుతున్నప్పుడు, నిస్సహాయ మరియు పేదరికంతో బాధపడుతున్న ప్రజల బాధలను తొలగించడానికి తాను ఎంతో చేయవలిసియున్నదని గ్రహించారు. అందుకు గాను త్వరలోనే ఆర్థర్ నజరేతు గ్రామములో మరియు చుట్టు ప్రక్కల గ్రామాలలో క్షేత్ర స్థాయి సువార్త ప్రచారాన్ని ప్రారంభించారు. తత్ఫలితముగా చాలా మంది క్రీస్తు యొద్దకు నడిపించబడ్డారు. ఆ ప్రాంతంలో ఆర్థర్ చేసిన వైద్య సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా, 1902 వ సం|| లో ఘోరమైన కలరా వ్యాధి తో నగరం వినాశనం అవుతున్నపుడు, ఆర్థర్ గుర్రపు స్వారీచేస్తూ ప్రజలను సందర్శించి వారికి వైద్య సహాయం అందించారు. దుఃఖిస్తున్న ప్రజలను ఓదార్చుట మరియు వారికున్న భయాన్ని తొలగించుట తన కర్తవ్యముగా భావించిన ఆర్థర్, ప్రజలను ధైర్యపరచి ఆదరించుటకు దాదాపు ప్రతిరోజూ సమాజ సేవ నిర్వహించారు.
వెనుకబడిన మరియు గుర్తింపులేని కుగ్రామమైన నజరేతు ఆర్థర్ ప్రారంభించిన సంస్కరణాత్మక కార్యకలాపాల వలన అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారింది. నజరేతులో ఆస్పత్రులు, విద్యా సౌకర్యాలు, అనాథాశ్రమాలు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాలను స్థాపించడంలో ఆర్థర్ చేసిన ప్రయత్నాలు స్థానిక ప్రజల సామాజిక స్థితిని మార్చాయి. ఈ ప్రయత్నాలన్నింటిలోనూ, తన ప్రజల ఆధ్యాతిక వికాసం ఆర్థర్ కు ఎంతో ప్రాముఖ్యమైనది. 1890 వ సం|| లో ఆర్థర్ స్థాపించిన వేదాంత శిక్షణా సంస్థ దినదినాభివృద్ధి చెంది చాల మంది దైవసేవకులను లేవనెత్తింది. ఆర్థర్ కేవలం మిషనరీ గా మాత్రమే కాకుండా అక్కడి ప్రజలకు వైద్యునిగా, విద్యావేత్తగా, స్నేహితునిగా మరియు మార్గదర్శిగా ఉండుట ద్వారా ఇతర మిషనరీలకు ఒక మాదిరిగా ఉన్నారు.

🚸 * పియ్రమైనవారలారా, మీరు అవసరానికి అనుగుణంగానా లేక మీ సౌలభ్యం ప్రకారం దేవుని సేవ చేస్తున్నారా?*🚸 🛐 *"ప్రభువా, మీ సేవ చేయుటకు నా సౌలభ్యం మరియు సౌకర్యాన్ని విడిచిపెట్టుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
  • WhatsApp
  • No comments:

    Post a Comment