Search Here

Aug 2, 2021

Wellesley Bailey | వెల్లెస్లీ బెయిలీ

 వెల్లెస్లీ బెయిలీ| Wellesley Bailey జీవిత చరిత్ర

జననం : 28.04.1846
మరణం : 1937
స్వస్థలం : -
దేశం : ఐర్లాండ్
దర్శన స్థలము : భారత దేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు
వెల్లెస్లీ బెయిలీ అనే ఒక ఐరిష్ యువకుడు తనకు జీవనోపాధి దొరుకుతుందనే ఆశతో 1869 వ సం|| లో భారత దేశానికి పయనవమైనారు. వెల్లెస్లీ భారత దేశంలో ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందుతున్నప్పుడు కుష్ఠు వ్యాధి యొక్క విధ్వంసకరమైన దుష్ప్రభావాలను మొదటిసారిగా చూశాడు. అప్పటి వరకు, వెల్లెస్లీ కుష్ఠు వ్యాధి మరియు కుష్ఠు రోగాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కథల నుండి మాత్రమే విన్నాడు. కుష్ఠు రోగుల యొక్క భయంకరమైన జీవన పరిస్థితులు మరియు సామాజిక ఒంటరి తనం వెల్లెస్లీని ఎంతో కలచివేసింది. వెల్లెస్లీ తన హృదయ వాంఛను వివరిస్తూ, "ప్రపంచం లో క్రీస్తును పోలిన పని ఏదైన ఉంది అంటే అది ఈ పేద బాధితుల మధ్యకు వెళ్లి వారికి సువార్త ద్వారా ఓదార్పునివ్వడమే" అని వ్రాశాడు.
వెల్లెస్లీ కాలంలో, కుష్ఠు వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. భారత దేశంలో కడు పేదరికంలో మరియు సమాజం చేత తృణీకరించబడిన జీవితాలు జీవిస్తున్న కుష్ఠు వ్యాధి బాధితులను గూర్చి వివరించుట ద్వారా అవగాహన కల్పించుటకు వెల్లెస్లీ, తన భార్య అయిన ఆలిస్ తో కలిసి ఐర్లాండ్ తిరిగి వెళ్లారు. అక్కడి ప్రజలు ప్రార్థనలు మరియు ఆర్థిక సహాయం ద్వారా తమ మద్దతును అందించడంతో వెల్లెస్లీ దంపతులు భారత దేశంలో కుష్ఠు వ్యాధి బాధితుల సహాయార్థం 1874 వ సం|| లో "ది మిషన్ టు లెపర్స్"(ఇప్పుడు లెప్రసీ మిషన్ అని పిలుస్తారు) ను ప్రారంభించారు. 1870 వ సం|| చివరి నాటికి, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న 100 మందికి ఈ ప్రత్యేక బృందం(మిషన్) మద్దతు ఇచ్చింది. వెల్లెస్లీ కుష్టువ్యాధిగ్రస్తుల మధ్య పని చేస్తున్న ఇతర మిషనరీలను కూడా సందర్శించి వారికి పరిపాలనాపరంగా మరియు ఆర్ధికంగా సహకారాలందించారు. త్వరలోనే, వెల్లెస్లీ సహాయం కోరుతూ ఇతర దేశాల నుండి లేఖలు వచ్చాయి. అందువలన వెల్లెస్లీ తన పరిచర్యను చైనా, న్యూజిలాండ్, మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు విస్తరించారు.

ప్రపంచవ్యాప్తంగా కుష్ఠు వ్యాధి బారిన పడిన వారికి వైద్యం, సమాజంలో చేరిక మరియు గౌరవాన్ని తీసుకువచ్చిన ఈ సంస్థ ఆవిర్భావమునకు వెల్లెస్లీ యొక్క కరుణయే కారణము. కుష్ఠు రోగుల మధ్య అవసరమైన పరిచర్య చేయునట్లు క్రైస్తవులలో మరియు మిషనరీలలో అవగాహన కలిగించుటకు వెల్లెస్లీ అనేక దేశాలలో పర్యటించారు. స్వయానా ప్రార్థనాపరుడైన వెల్లెస్లీ, తన పరిచర్య ప్రార్థన ద్వారానే అభివృద్ధి చెందిందని, ప్రతి విజయానికి కారణం ఈ ప్రార్ధనలే అని విశ్వసిస్తారు. కుష్ఠు రోగుల యెడల శ్రద్ధ వహిస్తూ వారికి పరిచర్య చేయుట జీవితాశయంగా కలిగిన వెల్లెస్లీని "కుష్టురోగుల పితామహుడు" అని అభివర్ణించారు.
🚸 *"ప్రియమైనవారలారా, మీరు మీ సమాజంలోని బహిష్కృతులకు దేవుని ప్రేమను చూపించగలరా?"*🚸 🛐 *"ప్రభువా, ఈ సమాజముచే బహిష్కరించబడిన మరియు నిర్లక్ష్యం చేయబడిన వారికి సేవ చేయడానికి నన్ను బలపరచుము. ఆమెన్!"* 🛐
"🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
  • WhatsApp
  • No comments:

    Post a Comment