Search Here

Aug 28, 2021

Stella Franklin | స్టెల్లా ఫ్రాంక్లిన్

స్టెల్లా ఫ్రాంక్లిన్  | Stella Franklin


  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


 1896–97 మధ్య భారతదేశంలో సంభవించిన కరువు ఆ దేశం ఎదుర్కొన్న ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఒకటి అని చెప్పవచ్చు. ఒకవైపు ఆకలి బాధతో, మరొకవైపు తెగుళ్ళతో ప్రజల మరణాల రేటు ఎంతో అధికంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో సుమారుగా పది లక్షల మంది మరణించినట్లు అంచనా. భారతీయులు శ్రమలలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న అటువంటి సమయంలో వారి ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు దేవుడు అనేక మంది దైవభక్తి గల స్త్రీ పురుషులను లేవనెత్తాడు. అటువంటి వారిలో ఒకరే స్టెల్లా ఫ్రాంక్లిన్. 


 1895వ సంll లో భారతదేశానికి వచ్చారు స్టెల్లా ఫ్రాంక్లిన్. తన సోదరి జోసెఫా వలెనే తాను కూడా మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయుటకు స్టెల్లా సిద్ధపడ్డారు. అయితే భారతదేశంలో కరువు యొక్క తీవ్రత ఆమె పని తీరును మార్చివేసింది. అప్పటికే తన సోదరి సేవలందిస్తున్న స్థలములోనే, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలలో పాలుపంచుకొనమని స్టెల్లాను కోరారు. కాగా ఆమె ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక అనాథాశ్రమము యొక్క బాధ్యతలు స్వీకరించి, వందలాది మంది పిల్లల సంరక్షణా వ్యవహారాలను చేపట్టారు. అక్కడ ఉన్న పిల్లలలో అనేకమందికి కరువు తీరిన తరువాత తిరిగి వెళ్ళుటకు ఇళ్ళు లేవు. అటువంటి పిల్లలను స్టెల్లా తన రెక్కల క్రిందకు తీసుకొని, వారికి ఆహారమిచ్చి పోషించి, విద్యను నేర్పించడమే కాక ఆత్మీయ ఆహారమును కూడా అందించారు.


 తదుపరి దామో అనే ప్రాంతంలో మహిళల మధ్య సువార్త పనిని ప్రారంభించారు స్టెల్లా. ప్రారంభంలో ఆమె తన అనాథాశ్రమంలోని పిల్లల యొక్క తల్లులను సంధించారు. సువార్త ప్రచారానికి వెళ్లినప్పుడు తాను వెళ్ళిన ప్రదేశంలో గుడారం వేసుకొని నివసించే ఆమె, తన వ్యక్తిగత భద్రతను గానీ లేదా సౌకర్యాన్ని గానీ ఏనాడూ లెక్క చేయలేదు. అటువంటి ఒక పర్యటనలో ఆమె దాదాపు డెబ్భై గ్రామాలను సందర్శించారంటే అది ఆశ్చర్యకరమైన విషయమే! ఆమె దర్శించిన ఆ గ్రామాలలో చాలా వరకు మునుపెన్నడూ ఏ సువార్తికులూ వెళ్ళనివి. ఆమె బైబిలు బోధించే విధానం అన్ని వర్గాల వారికీ వారి పరిస్థితులకు తగినట్లుగాను మరియు ఎంతో స్పష్టముగాను ఉండేది.


 1905వ సంll లో ఆమె విద్యా పరిచర్యను నియంత్రించుటకును మరియు పాఠశాల నిర్వహణను చేపట్టుటకును హర్దాకు వెళ్ళారు. తదుపరి బైబిల్ కళాశాలలో బోధించుటకు జబల్‌పూర్‌కు వెళ్ళిన ఆమె, పిమ్మట 1912వ సంll లో బాలికల బోర్డింగ్ పాఠశాలలో సేవలందించుటకుగాను ముంగేలికి వెళ్ళారు. ఆ పనిలోనే ఆమె తన పరిచర్య యొక్క మిగిలిన సంవత్సరములను గడిపారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి క్రైస్తవ సంఘములకు కావలసిన ఆలోచనలను అందించుటకును మరియు కుటుంబ వ్యవహారాలలో సలహాల కొరకును ప్రజలు ఆమెను ఆశ్రయించేవారు. ఆమె కలిగియున్న అద్భుతమైన బుద్ధిజ్ఞానములు మరియు కనికరముతో ఇతరులను అర్థము చేసుకొనగలిగిన వ్యక్తిత్వము ప్రతి స్థలములోనూ వారు ఆమెను ఆశ్రయించుటకు కారణమయ్యేవి.


🚸 *ప్రియమైనవారలారా, నశించుచున్న ఆత్మల యొక్క ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


🛐 *"ప్రభువా, నేను మీకు సేవ చేయునప్పుడు నా సౌకర్యము కొరకు నేను ఆశించకుండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

*******


  • WhatsApp
  • No comments:

    Post a Comment