Search Here

Oct 1, 2021

C. S. Durand | సి. ఎస్. డురాండ్

సి. ఎస్. డురాండ్ |  C. S. Durand


  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


డాll సి. ఎస్. డురాండ్ వైద్యశాస్త్రములో తన చదువును ఇంకా పూర్తిచేయవలసి యుండగానే మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు. కాగా న్యూయార్క్‌లో వైద్య శాస్త్రములో తన ఉన్నత చదువును (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేసుకొనిన తరువాత అతను తన భార్యతో కలిసి “డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్” (క్రీస్తుని శిష్యులు) అనే మిషన్ తరపున సేవ చేయుటకు భారతదేశానికి పయనమయ్యారు. ఈ దంపతులు తమ వృత్తి పట్ల పూర్తి అంకితభావమును కలిగియున్నారు. అయినప్పటికీ, అనేకమంది ఇతర వైద్యమిషనరీల వలెనే వీరు కూడా తమను కేవలం వైద్యపరమైన సేవలందించుటకే పరిమితం చేసికొనక అన్నివిధములైన మిషన్ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.


డురాండ్ మధ్య భారతదేశంలోని హర్దా అనే ప్రాంతములో నియమితులయ్యారు. తనకు భాష తెలియకపోయినప్పటికీ అక్కడ అతను ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అతను సమయమును వృథాగా పోనివ్వక స్థానిక భాషయైన హిందీని నేర్చుకునే సమయంలోనే వైద్య సేవలను అందించడం కూడా మొదలుపెట్టారు. వైద్య సహాయము యొక్క అవసరతలో ఉన్నవారి సంఖ్య అధికమవుతూ వస్తుండడంతో ఒక ఆసుపత్రిని నిర్మించాలనుకున్నారు డురాండ్. కాగా అందుకొరకు ఒక స్థలమును కనుగొనవలెనని అతను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అవన్నీ విఫలయత్నాలే అయ్యాయి. ప్రయత్నించీ ప్రయత్నించి చివరికి విసిగిపోయిన అతను ఆసుపత్రి కట్టబడవలెననుకుంటే దేవుడే అందుకొరకు ద్వారములను తెరువవలెనని ప్రార్థించారు. తత్ఫలితముగా ఎంతో అద్భుతకరముగా ఆ మరుసటి దినముననే ఒక వ్యక్తి వచ్చి ఆసుపత్రి కొరకు కొంత భూమిని ఇచ్చాడు. వెంటనే దానిని అంగీకరించిన డురాండ్, వెనువెంటనే ఆసుపత్రిని నిర్మించడం ప్రారంభించారు. అది అన్నింటికీ సరిపోని ఒక చిన్న భవనమే అయినప్పటికీ ఒక గొప్ప మిషనరీ సేవకు నిలయంగా మారింది.


కుష్టురోగుల మధ్య కూడా పనిచేసిన డురాండ్, వారిని బాగుపరచుటకుగాను ఆ రోగ నివారణల గురించి ఒక ప్రత్యేక అధ్యయనం చేశారు. అతనితో కలిసి పనిచేస్తున్న మరొక మిషనరీయైన వార్టన్ కుష్టు రోగులకు సువార్తను ప్రకటించగా, డురాండ్ వైద్య సేవలను అందించేవారు. అతను పట్టణం శివార్లలో కుష్టురోగుల కొరకు ఒక శరణాలయాన్ని ఏర్పరిచారు. అక్కడ అతను కుష్టురోగులకు ఒక గృహమును ఏర్పరచి, వారి కష్టమును, అనుభవిస్తున్న బాధలను తగ్గించుటకై తాను చేయగలిగినదల్లా చేశారు. డురాండ్ చేసే వైద్య సేవతో సువార్త పరిచర్య కూడా ఎల్లప్పుడూ మిళితమై యుండెడిది. అతను క్రీస్తును అంగీకరించమని తన రోగులకు నేరుగానే విజ్ఞప్తి చేసేవారు.


మరొకవైపు డురాండ్ యొక్క భార్య బాలుర పాఠశాల బాధ్యతను నిర్వహించేవారు. ఆమె రోజుకు అనేక గంటల పాటు బోధించేవారు. తక్కువ కులలాకు చెందిన పిల్లలు మరియు పెద్దల కొరకు ఆదివారపు బైబిలు పాఠశాల తరగతులను (సండే స్కూల్) నిర్వహించిన ఆమె వారికి బోధించుటలో ఎంతో ఆనందించేవారు. అంతేకాకుండా, ఆమె మహిళలను మరియు బాలికలను వారి గృహములలో సంధించి, వారి మధ్య పరిచర్య చేశారు. కొన్నిసార్లు వైద్యుడు లేనప్పుడు ఆమె వైద్యశాల యొక్క బాధ్యతలను కూడా చేపట్టేవారు.


ఆ విధంగా భారతదేశంలో ఫలవంతమైన పరిచర్య జరిగించిన తరువాత డురాండ్ దంపతులు స్వదేశమునకు తిరిగి వెళ్ళినప్పటికీ చివరి వరకు దేవుని సేవలో నిలిచియున్నారు.


ప్రియమైనవారలారా, మీరు మీ వ్యక్తిగత పనులతో సువార్త ప్రకటనను మిళితం చేయుచున్నారా? 


"ప్రభువా, భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు ద్వారములను తెరిచి, మార్గములను సరాళము చేయుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment