Search Here

Jul 26, 2022

Margaret Stephen Kennedy | మార్గరెట్ స్టీఫెన్ కెనడీ

మార్గరెట్ స్టీఫెన్ కెనడీ గారి జీవిత చరిత్ర



  • జననం: 18-01-1814
  • మహిమ ప్రవేశం: 23-05-1891
  • స్వస్థలం: అబెర్డీన్
  • దేశం: స్కాట్లాండు
  • దర్శన స్థలము: భారతదేశం


మార్గరెట్ స్టీఫెన్ కెనడీ భారతదేశానికి వచ్చి సేవ చేసిన మొట్టమొదటి జెనానా మిషనరీలలో ఒకరు. ఆ కాలంలో బహిరంగ ప్రదేశాలలో కనిపించుటకు గానీ, పురుషులతో మాటలాడుటకు గానీ అనుమతించబడని భారతీయ మహిళల యొద్దకు సువార్తను మోసుకువెళ్ళుటకు ఈ జెనానా పరిచర్య మహిళా మిషనరీలను పంపేది.


దైవభక్తి కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన మార్గరెట్, పదమూడేళ్ళు నిండక మునుపే ఆత్మీయ విషయములపై ఆసక్తిని పెంచుకున్నారు. అయితే చర్చికి హాజరుకావడం కంటే ఆత్మీయ సంబంధమైన పుస్తకములతో నిండియున్న తన తండ్రి యొక్క గ్రంథాలయములో సమయమును గడపడమంటే ఆమెకు చాలా ఇష్టం. తన ఈడు అమ్మాయిలకు భిన్నంగా ఉండే ఆమె, నీతి కలిగిన జీవితమును గడుపుటకు ప్రయత్నించారు. అయితే ఒక సంఘ కూడికలో నీతి క్రియలపై ఇవ్వబడిన ఒక ప్రసంగమును ఆమె విన్నప్పుడు, అది ఆమె జీవితమును మార్చివేసింది. తాను ఒక స్వనీతిపరురాలిగా ఉన్నట్లు, రక్షింపబడుటకు తనకు దేవుని కృప అవసరం అన్నట్లు ఆమె వెంటనే గ్రహించారు. తత్ఫలితముగా ఆ రోజున ఆమె తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నారు.


భారతదేశంలో మిషనరీ అయిన ఆమె సోదరి ఎలిజా అన్నా నుండి పిలుపును అందుకొనిన మార్గరెట్ 1838వ సంll లో బెనారస్‌కు చేరుకున్నారు. సున్నితమైన శరీరం కలిగిన మార్గరెట్ భారతదేశము యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డారు. కాగా అనారోగ్యం కారణంగా ప్రారంభ దినములను దేవుని కొరకు పనిచేయుట కంటే అధికముగా విశ్రాంతి తీసుకొనుటలోనే గడిపారు. అయితే ఎటువంటి అవరోధాలు గానీ, అనారోగ్యం గానీ మార్గరెట్ యొక్క దృఢమైన మనస్సుకు సరితూగలేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తనను అలవరచుకున్న ఆమె, హిందీ భాషను నేర్చుకున్నారు మరియు ప్రారంభములో అనాథ పిల్లల మధ్య పరిచర్య చేసి, వారి కొరకు ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్) నిర్వహించారు. జేమ్స్ కెనడీతో ఆమెకు వివాహం జరిగిన తరువాత, కుటుంబముగా వారు అల్మోరా అనే ప్రాంతమునకు తరలి వెళ్ళారు. అక్కడ ఆమె కుష్ఠురోగులకు సేవ చేయుటలో తన సమయమును వెచ్చించి, వారిలో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించారు.


భారతదేశములో మార్గరెట్ చేసిన అతి ముఖ్యమైన పరిచర్య జెనానా మిషనరీగా ఆమె జరిగించిన సేవ. వైద్య సేవలను లేదా విద్యను అందించుట కొరకు మాత్రమే భారతీయ మహిళలను కలవడానికి మహిళా మిషనరీలు అనుమతించబడినప్పటికీ, వారిని సందర్శించుట వెనుక ఉన్న మార్గరెట్ ఉద్దేశ్యం వారికి సువార్తను అందించడమై యున్నది. అందును బట్టి ఆమె కొట్టబడవచ్చు లేదా చంపబడవచ్చు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా ఆమె సందర్శించిన స్త్రీలు ఖచ్చితముగా యేసు క్రీస్తును ఎరుగునట్లు ఆమె నిశ్చయపరిచారు. ఆ విధముగా ఆమె ఒక కూర్గి యువరాణిని కూడా క్రీస్తు కొరకు సంపాదించారు.


వృద్ధాప్య దశలో 1877వ సంll లో మార్గరెట్ భారతదేశాన్ని విడిచి ఈడిన్‌బర్గ్ వెళ్ళారు. అక్కడ వృద్ధులకు, అనారోగ్యముతో ఉన్నవారికి, పేదలకు సేవ చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయిన మార్గరెట్ స్టీఫెన్ కెనడీ, చివరికి 1891వ సంll లో దేవుని కొరకు తాను పడిన కష్టము నుండి పరమ విశ్రాంతిని పొందారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, స్వనీతి నుండి మీరు విడుదల పొందారా? 


ప్రార్థన :

"ప్రభువా, స్వనీతి అనే అంధత్వముతో కూడిన పాపము నుండి నన్ను విడిపించుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment