Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Jun 22, 2022

Claude L. Pickens Jr | క్లాడ్ ఎల్. పికెన్స్ జూనియర్

క్లాడ్ ఎల్. పికెన్స్ జూనియర్ గారి జీవిత చరిత్ర







జననం: 20-04-1900

మహిమ ప్రవేశం: 22-01-1985

స్వస్థలం: అలెగ్జాండ్రియా, వర్జీనియా

దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

దర్శన స్థలము: చైనా మరియు అరేబియా 


 కొంతమంది ఒక ప్రదేశం కొరకు దర్శనమును కలిగియుంటే, మరి కొంతమంది ఒక జనము కొరకు భారమును కలిగియుంటారు; ఇంకొంతమంది ఒక నిర్దిష్టమైన పని లేదా వృత్తి ద్వారా పరిచర్య చేయుటకు పిలువబడుతారు. వారి మార్గాలు భిన్నంగా కనిపించవచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే! అది “సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” (మార్కు 16:15) అనునదే!


 ముస్లిం ప్రజలను క్రీస్తు నొద్దకు తెచ్చుటకై పరిచర్య చేసిన మిషనరీలలో క్లాడ్ లియోన్ పికెన్స్ జూనియర్ కూడా ఒకరు. తన యవ్వనదశలో మిషనరీలను సంధించిన అనుభవములు అతనిలో మిషనరీ సేవ కొరకైన ఆసక్తిని రేకెత్తించాయి. కాగా చివరికి 1922వ సంll లో మిచిగాన్‌లో జరిగిన ‘క్రిస్టియన్ కాలింగ్ కాన్ఫరెన్స్‌’ అనే కూడికలలో శామ్యూల్ జ్వెమర్ యొక్క ప్రసంగం వినిన పిమ్మట అతను మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు. ఒక ఏడాది తరువాత అతను జ్వెమర్ యొక్క కుమార్తెయైన నెల్లీ ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. తదుపరి వారిరువురు కలిసి “ఫారిన్ అండ్ డొమెస్టిక్ మిషనరీ సొసైటీ” (ఎఫ్.డి.ఎమ్.ఎస్.) అనే సంస్థ ద్వారా చైనాకు మిషనరీలుగా పయనమయ్యారు.

చైనా చేరుకున్నప్పుడు వారు చైనా భాషను అభ్యసించుట కొరకు మొదట నాన్జింగ్ అనే ప్రాంతములో కొంత కాలం గడిపారు. తదుపరి అంతర్గత యుద్ధం కారణంగా వారు అక్కడి నుండి పారిపోయి షాంఘైకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ “సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది మోస్లెంస్ ఇన్ చైనా” (ఎఫ్.ఓ.ఎమ్.) అనే సంస్థతో చేరిన పికెన్స్, ఆ సంస్థ యొక్క కార్యదర్శిగా పనిచేశారు. మరొక వైపు, శిక్షణ పొందిన నర్సు అయిన నెల్లీ, శిశువుల కొరకు ఒక క్లినిక్ నడుపుతూ తన భర్తకు పరిచర్యలో సహాయకారిగా ఉన్నారు. 1937వ సంll వరకు కూడా పికెన్స్ యాంగ్జీ నది వెంబడి ఉన్న నౌకాశ్రయములలోను మరియు సెయింట్ పీటర్స్ చర్చిలో సహాయక పాదిరిగాను పరిచర్య చేశారు.

పికెన్స్ మరియు మరికొందరు మిషనరీలు కలిసి వాయువ్య చైనా, ఈశాన్య టిబెట్ మరియు ఇన్నర్ మంగోలియాలలోని ముస్లింల మధ్య సంచార పరిచర్య జరిగించారు. చైనాలో చైనా-జపాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిప్పీన్స్ దీవులలోని జాంబోంగాలో ముస్లింల మధ్య సేవ చేసిన పికెన్స్, 1939వ సంll లో మధ్య చైనాకు తిరిగి వచ్చారు. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పికెన్స్ మరియు అతని కుటుంబం జపానీయులచే బంధించబడి 1941-1942 వ సంll వరకు చెరసాలలో ఉంచబడ్డారు. విడుదలైన తరువాత అతను తిరిగి అమెరికాకు వెళ్ళి న్యూయార్క్‌లో ఎఫ్‌డిఎంఎస్ సంస్థ తరఫున సేవ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత తిరిగి చైనాకు వచ్చిన అతను, 1950వ సంll వరకు అక్కడ పరిచర్యను కొనసాగించారు.

అటు పిమ్మట పికెన్స్ అమెరికాలో విద్యార్థుల మధ్య పరిచర్య చేశారు. తరువాత అతను 1962వ సంll లో అరేబియాకు వెళ్లి అక్కడి అరాంకో కంపెనీ ఉద్యోగుల మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశారు. చైనాలో ఇస్లాంకు సంబంధించి పికెన్స్ సేకరించిన వెయ్యికి పైగా ఛాయాచిత్రాలు మరియు సాహిత్య రచనలు కేంబ్రిడ్జ్‌లో ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక విలువైన నిధివలె నేటికీ భద్రపరచబడి ఉన్నాయి.


ప్రియమైనవారలారా, మీ జీవితంలో మీ యొక్క లక్ష్యం ఏమిటి?


ప్రభువా, ఎక్క డ అవకాశము లభించిననూ, దానిని మీ మహిమార్థమై వాడుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

*******

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Apr 7, 2022

    Clarinda | క్లారిండా

    క్లారిండా జీవిత చరిత్ర



    • జననం : ~ 1746
    • మరణం : ~ 1806
    • స్వస్థలం : తంజావూరు 
    • దేశం   : భారతదేశం 
    • దర్శన స్థలము : తమిళనాడు, భారతదేశం


    హిందూ కులాలలో సతీసహగమనం అనునది ఒక ఆచారం. అదేమంటే భర్త మరణించినట్లయితే, భార్య తన భర్త శరీరాన్ని దహనం చేసే చితిలో తాను కూడా ప్రాణాలను అర్పిస్తుంది. ఒక వైపు వితంతువులను తృణీకరిస్తున్న సనాతన భారతీయ సమాజం, మరొక వైపు మరణించిన భర్త పట్ల భార్య కలిగియున్న పతిభక్తిని క్రియారూపకముగా కనుపరిచే అత్యున్నతమైన కార్యముగా అది పరిగణించబడినందు వలన వితంతువులకు సతీసహగమనాన్ని ఆచరించడమే ఏకైక పరిష్కారమయ్యింది. అటువంటి అమానుషమైన అనాగరిక చర్య నుండి రక్షించబడిన అతి కొద్దిమంది మహిళలలో క్లారిండా ఒకరు.


    క్లారిండా యొక్క అసలు పేరు కోకిల. ఆమె ఒక ప్రముఖ మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తంజావూరు రాజ దర్బారులో పనిచేసిన ఆమె భర్త, వారి వివాహం అయిన కొద్దికాలానికే మరణించడం జరిగింది. కాగా ఆమె సతీసహగమనాన్ని ఆచరించబోవుచుండగా, హెన్రీ లిటల్టన్ అనే ఆంగ్ల అధికారి ఆమె దుస్థితిని చూసి సజీవ దహనం కాకుండా ఆమెను రక్షించారు. అతను క్లారిండాను క్రైస్తవ జీవన విధానములోకి నడిపించారు. కాగా తమిళనాడులోని ఆ ప్రాంతాలలో చురుకుగా పరిచర్య చేస్తున్న క్రిస్టియన్ ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ ఆమెకు బాప్తిస్మమిచ్చి, క్లారిండా అనే క్రైస్తవ పేరును ఆమెకు పెట్టారు.


    బాప్తిస్మము పొందిన పిమ్మట క్లారిండా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మిషనరీ సేవ చేయుటకు తనను సమర్పించుకున్నారు. కాగా ఆమె పాలయంకోట్టైలో స్థిరపడి, అక్కడ స్త్రీల మధ్యలో, ముఖ్యంగా వితంతువులు, అనాథలు మరియు అణగారిన నిరుపేదల మధ్యలో పరిచర్య చేశారు. ఒక చిన్న సమాజముగా వారిని కూర్చుటలో విజయవంతురాలైన ఆమె, వారి మధ్య ఆరాధన సేవలను నిర్వహించడం ప్రారంభించారు. ఆ విధంగా ఆమె అక్కడ కైస్తవ సంఘమును ప్రారంభించి కట్టిన ఆలయమును ప్రతిష్ఠించుటకు 1785వ సంll లో, ష్వార్ట్జ్ పాలయంకోట్టైకు వచ్చారు. అతను ఆ సంఘమునకు "క్లారిండా చర్చ్" అని పేరు పెట్టారు. ఆమె పాలయంకోట్టైకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను కూడా సందర్శించి, అక్కడ కూడా క్రైస్తవాలయాలను మరియు పాఠశాలలను నిర్మించారు.


    క్లారిండా మంచి ఆత్మీయ గ్రహింపు కలిగియున్న స్త్రీ. ఆదర్శప్రాయమైన మరియు వాస్తవిక జీవితముల మధ్య సమతుల్యతను తీసుకురాగలిగిన ఆమె, ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ సమాన భావంతో చూసే క్రైస్తవ సంఘమును స్థాపించుటలో విజయవంతురాలయ్యారు. తన పరిచర్యలో హిందువుల నుండి ఎంతో వ్యతిరేకతను, అసంఖ్యాకమైన ఇబ్బందులను, రాజకీయ అస్థిరతను మరియు సామాజిక అన్యాయాన్ని ఆమె ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనుదిరుగక ధైర్యముగా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు క్లారిండా.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సువార్త ప్రకటించుటకై మీరు కులం, మతం, హోదా వంటి సామాజిక అడ్డంకులను అధిగమించారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, సువార్త ప్రకటించుటకై సామాజిక మరియు భౌతిక అడ్డంకులను అధిగమించుటకు నన్ను బలపరచుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Dec 27, 2021

    Karen Watson Life History

    కరెన్ వాట్సన్ గారి జీవిత చరిత్ర


    • జననం: 1965
    • మహిమ ప్రవేశం: 15-03-2004
    • స్వస్థలం: బేకర్స్‌ఫీల్డ్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: ఇరాక్

      “నేను సరైన నిర్ణయం తీసుకొనలేదేమో అని వెనక్కి తిరిగి చూచి విచారించే అవసరం దేవుడు పిలిచినప్పుడు ఉండదు. దేశములన్నింటి కొరకు నేను కలిగియున్న హృదయమును వీలైనంత వరకు మీతో పంచుకొనుటకు నేను ప్రయత్నించాను. ఒక ప్రదేశము యొద్దకు నేను పిలువబడలేదు; ఆయన యొద్దకు పిలువబడ్డాను. అందుకు విధేయత చూపడమే నా గురి, శ్రమననుభవించవలెననునది ఊహించగలిలినదే, ఆయన యొక్క మహిమ నాకు లభించే బహుమతి...
    మిషనరీ హృదయం అనునది
    కొందరు యుక్తమని ఎంచిన దానికంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది
    కొందరు సురక్షితమని తలంచిన దానికంటే ఎక్కువగా తెగింపును కలిగియుంటుంది
    ఆచరణబద్ధమని కొందరు భావించిన దానికంటే మించిన లక్ష్యములను కలిగియుంటుంది
    సాధ్యమని కొందరు భావించిన దానికంటే మించిన వాటిని ఆశిస్తుంది
     నా సౌఖ్యము కొరకో లేదా విజయము కొరకో కాదు, విధేయత చూపించుట కొరకు నేను పిలువబడ్డాను... యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట కంటే వెలుపల మరే సంతోషం లేదు...”
     ఇవి ఇరాక్‌కు తన మిషనరీ యాత్రను ప్రారంభించే ముందు కరెన్ వాట్సన్ తమ పాదిరిగారికి వ్రాసిన లేఖలోని కొన్ని మాటలు.

     క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కరెన్, తన వ్యక్తిగత జీవితములో తీవ్రమైన సంక్షోభకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. చర్చిలో ఆమె యవ్వనస్థులకు మరియు పిల్లలకు బైబిలు అధ్యయన తరగతులను నిర్వహించేవారు. అవకాశం వచ్చినప్పుడు ఆమె ఎల్ సాల్వడార్, మెక్సికో, మాసిదోనియా మరియు కొసావోలలో చిన్న చిన్న సువార్త ప్రచార కూడికలలో పాల్గొనడం ప్రారంభించారు. అటుపిమ్మట ఆమె హృదయం దేవుని పరిచర్య చేయుటకు మరి ఎక్కువగా వాంఛించడం ప్రారంభించింది. తత్ఫలితముగా ఆమె జైలు అధికారిగా మంచి జీతం వచ్చే తన ఉద్యోగమును విడిచిపెట్టి ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ లో (IMB - ఐ.ఎమ్.బి. - అంతర్జాతీయ మిషన్ బోర్డు) చేరారు.

     ఇరాక్‌ యొక్క ఉగ్రవాదులతో అమెరికా యుద్ధం చేస్తున్న సమయంలో 2003వ సంll లో కరెన్ తన ఇంటిని మరియు ప్రాపంచిక ఆస్థిపాస్తులన్నింటినీ విక్రయించి ఇరాక్‌లోని మోసుల్‌కు చేరుకున్నారు. అక్కడి యుద్ధ ప్రాంతాలలో మానవతా సహాయం అందించడం ప్రారంభించిన ఆమె, క్రీస్తు ప్రేమను బోధించుటకు ఆ అవకాశాలను ఉపయోగించుకున్నారు. యుద్ధం కారణంగా మూసివేయబడిన పాఠశాలలను ఆమె పునరుద్ధరించడం ప్రారంభించి, అనధికారికంగానే పిల్లలకు బోధించడం ప్రారంభించారు. నిరంతరం తీవ్రవాదుల నుండి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ ఉల్లాసంగాను, మంచి హాస్యభావముతోను మరియు కనికరము నిండుకొనినవారై యుండెడివారు. ఇరాక్‌లోని క్రైస్తవులు ఆమెను బైబిలు గ్రంథములో పేర్కొనబడిన ‘తబితా’ తో పోల్చేవారు.

     2002వ సంll మార్చి 15వ తారీఖున, కరెన్ మానవతా సహాయం అందించుటకై మరో ముగ్గురు మిషనరీలతో కలిసి వెళుతున్నారు. మార్గం మధ్యలో తుపాకీలను ధరించుకొనిన కొంతమంది ఆమె ప్రయాణిస్తున్న వాహనముపై మెరుపుదాడి చేసి కాల్పులు జరుపగా, కరెన్ మరియు ఆమెతో పాటు ఉన్న మిషనరీలందరూ తమ ప్రాణాలు కోల్పోయారు.

    ప్రియమైనవారలారా, మీరు యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట అనువాటికి వెలుపల ఉన్న తాత్కాలిక ఆనందమును పొంద ప్రయాసపడుతున్నారా?


    ప్రభువా, నాలో మిషనరీ హృదయమును పుట్టించుము .ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 22, 2021

    Clyde Dotson Life History

    క్లైడ్ డాట్సన్ గారి జీవిత చరిత్ర







    • జననం: 29-07-1905
    • మహిమ ప్రవేశం: 30-09-1982
    • స్వస్థలం: అలబామా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: రోడేషియా (జింబాబ్వే)

     1954వ సంవత్సరం, జనవరి మాసం. ఒకరోజు రాత్రి ఎక్కడో గోక్వే లోయలో (ప్రస్తుత జింబాబ్వే) విశ్రాంతి తీసుకొనుటకు గ్రామంలో స్థలం దొరకని ఒక మిషనరీ మోపనే చెట్టుకి (సీతాకోకచిలుక చెట్టు) ఊయలవేసి, దోమతెరను కట్టుకొంటున్నారు. అతను సువార్త బోధిస్తూ సైకిల్‌పై ప్రయాణించినందున అతను ఆ రోజు చాలా అలసిపోయి ఉన్నారు. అంతలో కొంతమంది గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఏనుగులు దాడి చేస్తాయని అతనిని హెచ్చరించారు. అప్పుడు ఆ మిషనరీ, “నా దేవుడు ఏనుగుల కంటే పెద్దవాడు. ఆయన నన్ను కాపాడుతాడు” అని సమాధానం ఇచ్చారు. అది రోడేషియా తెగల మధ్య క్లైడ్ డాట్సన్ యొక్క మిషనరీ ప్రయాణ ప్రారంభం.

     అలబామాలో పాదిరిగా పనిచేస్తున్న సమయంలో క్లైడ్‌కు ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేసే అవకాశం లభించింది. కాగా 21 సంll ల వయస్సులో అతను తన ఇంటిని విడిచిపెట్టి, చిమనీమణి జిల్లాలోని రుసితు మిషన్‌లో పనిచేయుటకు దక్షిణాఫ్రికా మిషన్ బోర్డ్‌లో చేరారు. అక్కడి సమాజంలో పాతుకుపోయి ఉన్న మూఢ నమ్మకాలు మరియు క్రైస్తవ సంఘములలో ప్రబలంగా ఉన్న జాతి వివక్షను చూసినప్పుడు అతని గుండె పగిలిపోయింది. అతనికి దేవుడు తప్ప మరే మద్దతు లేకపోయినప్పటికీ, రోడేషియాలోని అన్యజనులలో ఆత్మీయ మార్పు తీసుకురావాలని అతను ధృఢనిశ్చయముతో ముందుకుసాగారు.

     పోర్చుగీసు తూర్పు ఆఫ్రికా (ప్రస్తుతం మొజాంబిక్)లోని మారుమూల గ్రామాలలో సువార్తను ప్రకటించుటకును మరియు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించుటకును కొండ ప్రాంతాల గుండా క్లైడ్ చాలా దూరం కాలినడకన ప్రయాణించారు. గ్రామాలలో రాత్రి పూట విడిది చేసి, వస్తుమార్పిడి ద్వారా గ్రామస్థుల నుండి ఆహారమును పొందారు. ఒకసారి అతను సన్యాతి తెగవారికి ఇవ్వబడిన ప్రాంతములో మూడు నెలలు విడిది చేయగా, అది చివరికి సన్యాతి మిషన్ ప్రారంభానికి దారితీసింది.

     అతని మిషనరీ జీవితంలో ఎక్కువ భాగం విద్యుత్తు సదుపాయంలేకుండా గడ్డితో కప్పబడి, మట్టితో నిర్మించబడినటువంటి పూరిళ్ళలోనే అతని నివాసం సాగింది. స్నానం కొరకు 18 మైళ్ళు, త్రాగునీరు తెచ్చుకొనుటకు 100 మైళ్ళు అతను నడిచేవారు. అటువంటి కష్టతరమైన పరిస్థితులలో కూడా అతను దేవుని ప్రేమను ప్రకటిస్తూ 40 సంవత్సరాల పాటు ఆఫ్రికాలోనే ఉన్నారు. ఆ కాలపరిథిలో అతను 26 క్రైస్తవాలయములను నిర్మించారు మరియు 126 మందికి పైగా ప్రజలకు బాప్తిస్మము ఇచ్చారు.

     ఆరోగ్యం బాగా క్షీణిస్తుండటంతో 1972వ సంll లో అతను అలబామాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ 1982వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా అలబామాలో దేవుని పరిచర్యను కొనసాగించారు క్లైడ్ డాట్సన్.
    ప్రియమైనవారలారా, మన దేవుని యొక్క శక్తిపై మీకున్న విశ్వాసం ఆయన కొరకు శక్తివంతమైన కార్యములను చేయుటకు మిమ్ములను పురికొల్పెడిదిగా ఉన్నదా?

    ప్రభువా, నీవు అన్నింటికన్నా శక్తిమంతుడవు అన్న విశ్వాసముతో ఈ లోకంలో భయాలను అధిగమించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 6, 2021

    Kreesthu Puttenu Pasula Paakalo | క్రీస్తు పుట్టెను పశుల పాకలో

    క్రీస్తు పుట్టెను పశుల పాకలో

    పాపమంతయు రూపు మాపను

    సర్వలోకమున్ విమోచింపను

    రారాజు పుడమిపై జన్మించెను


    సంతోషమే సమాధానమే - ఆనందమే పరమానందమే (2)

    అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి - యేసుని చూచి కానుకలిచ్చి

    పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే


    1. పరలోక దూతాలి పాట పాడగా - పామరుల హృదయాలు పరవశించగా (2)

    అజ్ఞానము అదృష్యమాయెను - అంధకార బంధకములు తొలగిపోయెను (2)


    2. కరుణగల రక్షకుడు ధర కేగెను - పరమును వీడి కడు దీనుడాయెను (2)

    వరముల నొసగ పరమ తండ్రి - తనయుని

    మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)

  • WhatsApp
  • Dec 4, 2021

    Loka Rakshakudu | లోక రక్షకుడు | కీర్తించెదము కొనియాడెదము | Manoj David

    కీర్తించెదము .. కొనియాడెదము .. ప్రకటించెదము .. వివరించెదము .. 

    లోక రక్షకుడే పుట్టెను 

    పాపుల రక్షకుడే వచ్చెను ( 2 )

    1. ఎవరీ పాపుల రక్షకుడు ? 

    దేవుడే పంపిన రక్షణే యేసయ్య 

    దైవమై దిగినా తరునమే ఇదిగా 

    దైవకుమారుడే వచ్చెను పశువుల పాకలో పుట్టెను ( 2 ) 

    2. ఈ రక్షకుడు ఏమి చేశాడు ? 

    రక్షకుడే ఏతెంచెగా పాపమే పోయేగా 

    రక్షణే కలిగెగా లోకమే మురిసేగా పాపము జయింపా వచ్చెను లోక పాపమునే మోసెను ( 2 ) 

    3. పాపం పోయిందా .. అయితే ఇప్పుడేంటి ? మరణమే జయించి సాతాన్నే త్రొక్కిన 

    జీవమే ఇచ్చెగా నరకమే మోసెగా 

    పరక్రముడై వచ్చెను పరలోక భాగ్యం ఇచ్చెను ( 2 ) 

    కీర్తించెదము .. కొనియాడెదము .. ప్రకటించెదము .. వివరించెదము .. లోక రక్షకుడే పుట్టెను పాపుల రక్షకుడే వచ్చెను ( 2 )



  • WhatsApp
  • Nov 21, 2021

    Katie Davis Majors Biography

    కేటీ డేవిస్ మేజర్స్ గారి జీవిత చరిత్ర






    • జననం: 01-11-1989
    • స్వస్థలం: నాష్విల్లే
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శనము: ఉగాండా

     ఉగాండాలో పేదరికంలో ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించుటకు తన మంచి జీవితమును విడిచిపెట్టిన ఒక యువ అమెరికా మిషనరీ కేటీ డేవిస్ మేజర్స్. చిన్నప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రబలముగా ఉన్న పేదరికం గురించి అవగాహన కలిగియున్న ఆమె తన ఆశీర్వాదకరమైన జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. సంవత్సరాలు గడిచేకొద్దీ పేదరికంలో ఉన్న ప్రజలను గురించిన భారం కూడా ఆమె హృదయంలో పెరిగింది. కాగా ఆమె తన కలలను విడిచిపెట్టి, అట్టి స్థితిలొ క్రీస్తు ఏమి చేయునో ఆలాగున చేయుటకు యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆమెను బలవంతపరిచింది.

     18 సంll ల వయస్సులో ఉన్నప్పుడు ఉగాండాలో కిండర్ గార్టెన్ ఉపాధ్యాయినిగా పనిచేసే అవకాశాన్ని పొందారు కేటీ. తన వయస్సులో ఉన్న అమ్మాయిలు ప్రాపంచిక ఆనందాలను కోరుతూ, విజయవంతమైన భవిష్యత్తునిచ్చే మార్గాలను ఎన్నుకొనుచుండగా, కేటీ మాత్రం ఉగాండాకు వెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు. కాగా తన తల్లితో కలిసి 2006వ సంll లో ఉగాండాలో అడుగుపెట్టిన ఆమె, అక్కడ పేదరికానికి కారణమవుతున్న నిరక్షరాస్యత, తత్ఫలితముగా బాల్య నేరస్థులను తయారుచేస్తూ భయంకరమైన పర్యవసానాలకు దారితీస్తున్న దుస్థితిని చూశారు. ఎవరి దగ్గర నుండైనా ఆర్థిక సహాయం దొరుకుతుందేమోయని వెతుకుటకు బదులుగా ఆమె తాను దాచుకొనిన ధనమును వెచ్చించి పది మంది నిరుపేద పిల్లలకు విద్యను అందించుట ద్వారా మొదట తాను ఇతరులకు ఒక మాదిరిగా నిలిచారు. అది ఆమె స్నేహితులు మరియు బంధువులలో చాలా మందికి ప్రేరణ కలిగించగా, అది 150 మంది పిల్లలకు తగినంత నిధుల సేకరణకు దారితీసింది. 

     ఒక సంవత్సరం పాటు మిషన్ పని చేసిన తరువాత తన పట్టా చదువు పూర్తిచేసుకొనుటకుగాను ఆమె అమెరికాకు తిరిగి వచ్చారు. అటు పిమ్మట ఉగాండాకు తిరిగి వెళ్ళాలనే ఆమె నిర్ణయానికి ఆమె కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ తన భూసంబంధమైన తండ్రి కంటే తన పరలోకపు తండ్రినే సంతోషపెట్టుటకు ఎంచుకున్న కేటీ, 2007వ సంll లో జింజాకు తిరిగి వచ్చారు. ఉగాండా ప్రజలకు క్రీస్తును తెలియపరచుట ద్వారా వారి జీవితాలను మార్చవలెననే లక్ష్యంతో అక్కడ ఆమె ‘అమాజిమా మినిస్ట్రీస్‌’ ను ప్రారంభించారు. నేడు అక్కడ ఒక క్రీస్తు కేంద్రీకృత పాఠశాలను నడుపుతున్న ఆమె, దాని ద్వారా జింజాలోని అనేక కుటుంబాలలో ఆత్మీయ మరియు భౌతికపరమైన మార్పును తీసుకువచ్చారు.

     తన భర్త బెంజి మేజర్స్ నుండి తన పరిచర్యకు మంచి మద్దతు పొందిన కేటీ, ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 13 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. పరిచర్యలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, “మీరు చిన్న చిన్న పనులన్నీ దేవుని యొక్క గొప్ప ప్రేమతో చేస్తున్నప్పుడు మీరు మీ జీవితముతో ఏదో ఒక గొప్ప పనిని చేస్తున్నారని అర్థం. మీరు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని మారుస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే మారుస్తున్నారని అర్థం. క్రీస్తు వలె ప్రేమను చూపించుటకు కలిగే అవకాశాలను మీరు కోల్పోనప్పుడు మీరు మీ ఉత్తమ జీవితాన్ని కోల్పోరు.” అని ఆమె చిరునవ్వుతో చెబుతారు. 

    ప్రియమైనవారలారా, మీ యవ్వన జీవితం ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ యొక్క మాధ్యమముగా ఉన్నదా?

    "ప్రభువా, చిన్న పనులు అయినా మీ యొక్క గొప్ప ప్రేమతో చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 18, 2021

    Constant Lievens | కాన్‌స్టాంట్ లీవెన్స్

    కాన్‌స్టాంట్ లీవెన్స్ గారి జీవిత చరిత్ర








    • జననం: 11-04-1856
    • మహిమ ప్రవేశం: 07-11-1893
    • స్వస్థలం: మూర్స్‌లెడ్
    • దేశం: బెల్జియం
    • దర్శన స్థలము: మధ్య భారతదేశం


     “చోటా నాగ్‌పూర్ యొక్క అపొస్తలుడు” అని పిలువబడే కాన్‌స్టాంట్ లీవెన్స్ మధ్య భారతదేశంలో పరిచర్య చేసిన బెల్జియం దేశపు ఒక మిషనరీ. అతను ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించినందున పంట భూములలో అతనికున్న అనుభవం మధ్య భారతదేశంలోని గిరిజనుల మధ్య, ప్రధానంగా ముండా, ఉరావ్ మరియు ఖరియా అనే తెగల మధ్య ఏడు సంవత్సరాల పాటు చేసిన పరిచర్యలో అతనికి ఉపకరించింది.
     విదేశాలలో మిషనరీ సేవ చేయవలెనన్న బలమైన కోరికతో ‘సొసైటీ ఆఫ్ జీసస్‌’ అనే సంస్థలో చేరిన లీవెన్స్, బ్రూగెస్‌లో ఆత్మీయపరమైన శిక్షణను ప్రారంభించారు. తదుపరి తన వేదాంత శిక్షణను పూర్తి చేసుకొనుటకుగాను 1880వ సంll లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు పంపబడ్డారు.
     1885వ సంll లో లీవెన్స్ చోటా నాగ్‌పూర్ పీఠభూమికి పంపబడగా, అక్కడ అతను స్థానిక భాషను మరియు వారి జీవన విధానమును నేర్చుకున్నారు. అటు తరువాత అతను రాంచీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న టోర్పాలో స్థిరపడ్డారు. అక్కడి పరిస్థితులను కొంచెం పరిశీలించిన పిమ్మట అక్కడి జాగీర్దారులు, జమిందారులు మరియు తికేదారుల నుండి గిరిజనులు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనియు మరియు శారీరకముగా శ్రమపెట్టబడుతున్నారనియు అతను కనుగొన్నారు. కాగా ఆచరణాత్మకమైన సువార్తతో వీరిని చేరుకొనగలిగే ఒక మార్గం వారి దుస్థితి నుండి విడుదల పొందుటకు వారికి సహాయపడుటయని గ్రహించారు లీవెన్స్. అందుకొరకు అతను సంప్రదాయ గిరిజన చట్టాలు మరియు బ్రిటిషువారి చట్టాలను అధ్యయనం చేసి, న్యాయస్థానములలో గిరిజనుల కేసులకు బలమైన మద్దతునిచ్చారు. వారు వారి భూములను తిరిగి పొందేందుకును మరియు వారి హక్కుల కొరకు నిలబడగలుగునట్లును అతను వారికి సహాయం చేశారు. చాలా మంది ఆదివాసులు అతనిని తమకు ఒక ‘రక్షకుని’ గా పరిగణించారు మరియు యేసు క్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించడం ప్రారంభించారు.
     ‘అగ్ని జ్వలించుచుండాలి’ అనే నినాదముతో జార్ఖండ్‌లోని కొండ ప్రాంతాలలో అలుపెరగకుండా ప్రయాణించారు లీవెన్స్. జార్ఖండ్ గిరిజనుల అభివృద్ధి కొరకు నిర్విరామంగా పనిచేసిన అతను, వారికి న్యాయం, విద్య మరియు ఆత్మీయ అభివృద్ధిని సమకూర్చారు. మరికొంతమంది మిషనరీలు కూడా వచ్చి అతనికి సహాయమందించారు. రెండేళ్ళ వ్యవధిలో అక్కడి క్రైస్తవుల సంఖ్య పదిహేను వేలకు పెరిగింది.
     విస్తారమైన పని వలన క్షీణించిపోయిన అతను, 1891వ సంll లో క్షయవ్యాధి బారినపడ్డారు. కాగా కోలుకొనుటకు డార్జిలింగ్‌లో కొంత సమయం గడిపిన తర్వాత, అతను తిరిగి బార్వా ప్రాంతానికి వచ్చి పన్నెండు వేల మందికి బాప్తిస్మం ఇచ్చారు. అయితే వ్యాధి తిరిగి రావడం అతనికి ప్రాణాంతకంగా మారింది. కాగా భారతదేశానికి తిరిగి వస్తానని ఆశిస్తూ, “నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని చెప్పి 1893వ సంll లో బెల్జియంకు తిరిగి వెళ్ళారు కాన్‌స్టాంట్ లీవెన్స్. అయితే 1893వ సంll నవంబరు మాసం 7వ తారీఖున తన సేవకుడిని మహిమలోకి పిలవడం దేవుని దృష్టికి మంచిదైయున్నది.

    ప్రియమైనవారలారా, మీలో ఆత్మీయ జ్వాలలు మండుచున్నాయా?

    "ప్రభువా, నీ సేవకులచే అసంపూర్తిగా విడిచిపెట్టబడిన ఏ పరిచర్యనైనా కొనసాగించి సంపూర్తి చేయుటకు నన్ను నేను సమర్పించుకొనెదను. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Nov 16, 2021

    Christmas Panduga vachenule | క్రీస్మస్ పండుగ వచ్చేనులే | Telugu Christmas song

    Christmas Panduga vachenule | క్రీస్మస్ పండుగ వచ్చేనులే | Telugu Christmas song

    క్రీస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం వచ్చేనులే
    ఆనందించెదం నూతన కీర్తన పాడేదం

    యేసయ్య ప్రేమను లోకానంత చాటెదం
    యేసయ్య మార్గములో ఆనందంగా సాగేదం

    కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
    పశువుల పాకలోనే పరిశుద్దుడు జన్మించెను
    దివి నుండి దూతలోచ్చి కొత్త పాటలు పాడెను

    గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
    రక్షకుడు పుట్టాడని లోకామంత చాటెను

    దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికోచ్చెను
    తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణము అర్పించేను
    సాతాను కట్లన్ని యేసయ్యే తెంచెను

    జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి

    బహుమానము ఇచ్చిరి సాగిలపడి మొక్కిరి

     

  • WhatsApp
  • Aug 1, 2021

    KANNA TALLI CHERCHUNATLU || కన్న తల్లి చేర్చునట్లు

     

    KANNA TALLI CHERCHUNATLU || కన్న తల్లి చేర్చునట్లు


    కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) 
    హల్లేలుయా హల్లేలుయా (2)

    కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న||

    చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2)         ||కన్న||

    నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2)       ||కన్న||

    చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2)       ||కన్న||
  • WhatsApp