Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 14, 2023

Samuel Kaboo Morris | శామ్యూల్ కబూ మోరిస్

శామ్యూల్ కబూ మోరిస్ గారి జీవిత చరిత్ర

  • జననం : 1872
  • మహిమ ప్రవేశం : 12-05-1893
  • స్వస్థలం : ఆఫ్రికా
  • దర్శన స్థలము : అమెరికా

శామ్యూల్ కబూ మోరిస్ (ప్రిన్స్ కబూ/కబూ యువరాజు) ఆఫ్రికాలోని లైబీరియాలో ఉన్న క్రూ అనే తెగ యొక్క నాయకుని కుమారుడు. అతను బాలునిగా ఉన్నప్పుడు గ్రీబో తెగవారు అతనిని బంధించి, క్రూ తెగ నుండి కప్పం వసూలు చేయుటకై అతనిని ఒక పాచికగా వాడుకున్నారు. కప్పం చెల్లించుటలో క్రూ తెగ ఎప్పుడైనా విఫలమయినట్లయితే గ్రీబో తెగవారు కబూ శరీరమునకు తేనె పూసి సజీవముగా అతనిని తిని వేయుటకు చీమల మధ్య అతనిని వదిలివేసేవారు. మరణపుటంచులలో నిస్సహాయమైన స్థితిలో ఉన్న కబూ, ఆ చిత్రహింసల వలన నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయారు. ఒక రాత్రి అతను కొరడాతో కొట్టబడబోతున్నప్పుడు, అకస్మాత్తుగా అక్కడ కళ్ళు బైర్లు కమ్మేటంత గొప్ప వెలుగు మెరుపులా మెరిసింది. అంతలో అతను "కబూ, పారిపో!" అనే శబ్దమును వినడం జరిగింది. వెంటనే అతను అడవిలోనికి పరుగెత్తారు. ఆపై దివారాత్రుళ్ళు ప్రయాణించి మన్రోవియా చేరుకున్నారు.


మన్రోవియాలో కొన్ని సంవత్సరాల పాటు గృహాలకు రంగులు వేస్తూ తన జీవనోపాధిని పొందారు కబూ. ఒక రోజు అతను స్థానికముగా ఉన్న క్రైస్తవ సంఘమునకు వెళ్ళగా, అక్కడ ఒక మిషనరీ కళ్ళు బైర్లు కమ్మేటంత ఒక ప్రకాశవంతమైన వెలుగు ద్వారా సౌలు ఏవిధముగా మారుమనస్సు పొందారో చెబుతుండగా విన్నారు. తన స్వంత జీవితగాథకు ఆ లేఖన భాగముతో ఉన్న సారూప్యతను చూచి ఆశ్చర్యపోయిన కబూ, “నేను ఆ వెలుగును చూశాను!” అని అరిచారు. తదుపరి అతను యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి  బాప్తిస్మము పొందగా అతనికి శామ్యూల్ మోరిస్ అనే క్రైస్తవ నామం ఇవ్వబడింది. అప్పటి నుండి అతను క్రీస్తును గురించి మరి అధికముగా తెలుసుకొనవలెననే వాంఛను కనుబరిచారు. కాగా ఒక మిషనరీ సూచన మేరకు అమెరికాకు పయనమైన అతను, 18సంll ల వయస్సులో న్యూయార్క్ నగరమునకు చేరుకున్నారు. అక్కడ స్టీఫెన్ మెరిట్ అనే వ్యక్తి సహాయంతో అతను ఇండియానాలోని టేలర్ విశ్వవిద్యాలయంలో చేరారు. సాధారణమైనదిగా ఉండే అతని శ్రేష్టమైన విశ్వాసం మరియు అతని యొక్క అద్భుత గాథ కళాశాలలోను మరియు ఆ చుట్టుప్రక్కల ఉండే జనసమూహములలోను ఉజ్జీవమును తీసుకువచ్చాయి.


మోరిస్ ముఖ్యముగా తన ప్రార్థన జీవితమును బట్టి పేరొందారు. రాత్రి సమయములో అతను తన గదిలో ప్రార్థించుచుండుటను వినవచ్చు. దానిని అతను ఎంతో సాధారణముగా ‘నా తండ్రితో మాట్లాడుతున్నాను’ అని పేర్కొనేవారు. ఇతరులకు సాక్ష్యమిచ్చుటకు కలిగిన ప్రతి అవకాశమును అతను వినియోగించుకున్నారు. అయితే సువార్తను తన స్వజనుల యొద్దకు తీసుకువెళ్ళవలెనని అతని హృదయం  ఎంతగానో వాంఛించింది. ఏదేమైనప్పటికీ కేవలం 21 ఏళ్ళ యవ్వన ప్రాయంలో తీవ్రమైన జలుబు బారినపడిన అతను, లేత వయస్సులోనే తన పరమ వాసస్థలమునకు చేరుకున్నారు. అతని అకాల మరణం అతని తరపున ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళి సేవ చేయుటకు అతని తోటి విద్యార్థులను ప్రేరేపించింది. తద్వారా ఏదో ఒక రోజు తన స్వజనులకు సేవ చేయుటకు తన స్వస్థలమునకు తిరిగి వెళ్ళవలెనన్న శామ్యూల్ మోరిస్ యొక్క కల నెరవేరింది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ పరలోకపు తండ్రితో మీరు ఎంత తరచుగా మాట్లాడుతున్నారు?

ప్రార్థన :

"ప్రభువా, మరింత తరచుగా మీతో సంభాషించుటకును, మీతో నేను కలిగియున్న వ్యక్తిగత సహవాసములో మరింతగా బలపరచబడి అభివృద్ధి చెందుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • May 13, 2023

    Samuel S. Day | శామ్యూల్ ఎస్. డే

    శామ్యూల్ ఎస్. డే గారి జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం : 13-03-1808
    • మరణం : 17-09-1871
    • స్వస్థలం : బాస్టర్డ్ టౌన్‌షిప్, ఓంటారియో
    • దేశం  : కెనడా
    • దర్శన స్థలము : తెలుగు ప్రాంతం, భారతదేశం


    "తెలుగు మిషన్" వ్యవస్థాపకుడైన శామ్యూల్ స్టెర్న్స్ డే అమెరికాకు చెందిన ఒక బాప్తిస్టు మిషనరీ. అతను తెలుగు మాట్లాడే ప్రజలకు వెలుగు తీసుకురావలెనని ఎంతో భారం కలిగి ఉన్నవారు. కాగా తన భార్యయైన రొయెన్నాతో కలిసి భారతదేశానికి వచ్చిన అతను, 1836వ సంll లో విశాఖపట్నంలో మిషనరీగా సేవను ప్రారంభించారు. తరువాత శ్రీకాకుళంకు వెళ్ళిన అతను, మరుసటి ఏడాది నాటికి మద్రాసుకు వెళ్ళారు. మద్రాసులో సేవ చేస్తున్న రోజులలో అక్కడి నుండి తెలుగువారి ప్రాంతానికి అనేక మార్లు పర్యటించారు శామ్యూల్. కాగా ఒక కోటికి పైగా ప్రజలు నివసిస్తున్న మద్రాసు మరియు విశాఖపట్నాలకు మధ్య ఉన్న ప్రాంతములో ఒక్క మిషనరీ కూడా లేరని గ్రహించిన అతని హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. తత్ఫలితముగా 1840వ సంll లో అతను తెలుగువారి ప్రాంతమైన నెల్లూరుకు వచ్చి, అక్కడ “తెలుగు మిషన్” ను స్థాపించారు. నెల్లూరు ప్రాంతంలో సువార్తను ప్రకటించిన అతను, 1844వ సంll నాటికి కొద్దిమంది విశ్వాసులతో అక్కడ ఒక క్రెస్తవ సంఘమును ప్రారంభించారు. అప్పుడు ఉన్న తెలుగు బైబిలు యొక్క అనువాదాలను మెరుగుపరచడంలో కూడా అతను సహాయమందించారు. ఆ దంపతులిరువురూ కలిసి బాలురు మరియు బాలికల కొరకు పాఠశాలలను కూడా స్థాపించారు. అప్పుడే వికసిస్తున్న మొగ్గగా ఉన్న ఆ పరిచర్య అతి త్వరలోనే అడ్డంకులను ఎదుర్కొంది. ఏలయనగా 1846వ సంll లో అనారోగ్యం కారణంగా ఆ మిషనరీ దంపతులు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.


    వారు అమెరికాలో ఉన్నప్పుడు, 'మిషనరీ యూనియన్' 'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనే ప్రశ్నను లేవనెత్తింది. అయితే దేవుడు నమ్మకమైనవాడు. ఆ మిషన్ కొనసాగించబడులాగున ఆయన లైమాన్ జ్యూవెట్‌ను లేవనెత్తాడు. తద్వారా 1849వ సంll లో జ్యూవెట్ దంపతులతో కలిసి శామ్యూల్ డే తిరిగి భారతదేశానికి రాగా, నెల్లూరు మిషన్ వద్ద పరిచర్య తిరిగి జీవం పోసుకుంది. ఆ మిషనరీలు అనేక  పాఠశాలలను ప్రారంభించారు, విస్తృతమైన సువార్త సేవ చేశారు. శామ్యూల్ డే ఒక కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టి, పశ్చిమ దిక్కుగా ఉదయగిరి వరకు ప్రయాణించి ఆ మార్గములోని ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. అయితే, క్రైస్తవులుగా మారిన వారి సంఖ్య అంత గణనీయంగా లేని కారణంగా, 1853వ సంll మిషనరీ యూనియన్‌లో  'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనునది మళ్ళీ చర్చనీయాంశమయ్యింది. కానీ, విస్తారమైన ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక మిషన్ ఇది మాత్రమే. ఆ సత్యాన్ని ఎత్తి చూపుతూ  'తెలుగు మిషన్' ‌ను ఒక 'ఒంటరి నక్షత్రం' గా వర్ణిస్తూ ఎస్. ఎఫ్. స్మిత్ వ్రాసిన "ది లోన్ స్టార్" అనే కవిత మిషనరీ యూనియన్‌లోని సభ్యుల హృదయాలను కదిలించింది. తత్ఫలితముగా జ్యూవెట్ ద్వారా ఆ మిషన్ కొనసాగించబడుటకు ఆమోదించబడింది. ఆరోగ్యం క్షీణించడం వలన శామ్యూల్ డే 1853వ సంll లో తిరిగి అమెరికాకు వెళ్ళినప్పటికీ, భారతదేశంలోని మిషనరీ సేవల కొరకు నిధులను సేకరించుటకు అతను అమెరికాలో వివిధ ప్రాంతాలకు విస్తృతంగా ప్రయాణించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, వెలుగు లేని ప్రదేశములో మీరు ఒక “ఒంటరి నక్షత్రం” గా ప్రకాశించెదరా?

    ప్రార్థన :

    "ప్రభువా, ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్న ఆత్మల గురించిన భారం నాలో కలిగించి, వారికి వెలుగును తెచ్చుటకు నేను ప్రకాశించునట్లు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Sarah Lanman Smith | శారా లాన్మాన్ స్మిత్

    శారా లాన్మాన్ స్మిత్ జీవిత చరిత్ర






    • జననం : 18-06-1802
    • మరణం : 30-09-1836
    • స్వస్థలం : కనెక్టికట్
    • దేశం       : అమెరికా
    • దర్శన స్థలము : అమెరికా, సిరియా


    శారా లాన్మాన్ హంటింగ్టన్ 1802వ సంll లో కనెక్టికట్‌లోని నార్విచ్‌లో జాబెజ్ హంటింగ్టన్ మరియు మేరీ లాన్‌మన్‌ అనే దంపతులకు జన్మించారు. 12 సంll ల చిన్న వయస్సులోనే ఆమె దైవిక విషయముల వైపు ఆకర్షించబడ్డారు. హ్యారియెట్ న్యూవెల్ మరియు ఆన్ జడ్సన్ యొక్క సాక్ష్యాలు యుక్త వయస్సులో ఉన్న ఆమె పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. 18 సంll ల వయస్సులో ఒక రోజు ఆమె ఒక సంఘ కూడికకు హాజరవ్వగా, ఒక క్రైస్తవురాలినని చెప్పుకుంటున్నప్పటికీ తాను కూడా ఒక పాపియేనని ఆ కూడికలో ఆమె గ్రహించారు. కాగా ఆ రోజు ఆమె తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు. తద్వారా ఆమెలో ఇతరులకు మేలు చేయవలెననే వాంఛ కలుగగా, వారిని క్రీస్తు వద్దకు తీసుకువచ్చుటకు ప్రయత్నించారు.


    నార్విచ్‌కు దగ్గరలో నివసించే మొహేగన్ ఇండియన్స్ అనే ప్రజలకు సువార్తను తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు శారాకు ఇరవై ఐదు సంవత్సరాలు. ఆమె వారిని సందర్శించి, సువార్త కరపత్రాలను పంచుతూ క్రీస్తు ప్రేమను గురించి వారికి తెలియపరిచారు. వ్యాఖ్యాతగా ఉన్న మరొక వ్యక్తి తోడ్పాటుతో ఆమె మొహేగన్ పిల్లల కొరకు సండే స్కూల్‌ను ప్రారంభించి, వారికి చదవడం మరియు వ్రాయడం నేర్పించారు. ఆమె గుర్రంపై ప్రయాణిస్తూ మార్గములో కలుసుకున్న వారితో సంభాషించేవారు. ఆమె తన యొక్క ప్రార్థనా సమూహం యొక్క సహాయంతో మొహేగన్ ప్రజల కొరకు "ఛారిటీ  వేర్‌హౌస్" ను కూడా ప్రారంభించారు. అటువంటి పరిచర్య చేస్తున్నప్పటికీ శారాకు మిషనరీగా సేవ చేయాలనే లోతైన వాంఛ ఉండేది. కాగా అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ (ఎబిసిఎఫ్ఎమ్) తరఫున సిరియాకు మిషనరీగా వెళ్ళిన ఏలి స్మిత్‌ను వివాహం చేసుకొనుట ద్వారా మిషనరీ సేవ చేయాలనే ఆమె కోరిక నెరవేరింది.


    1833వ సంll లో ఆ దంపతులు అప్పటిలో సిరియా భూభాగమైన లెబానోనులోని బీరుట్‌కు  ప్రయాణమయ్యారు. అక్కడ ఫ్రెంచ్, అరబిక్ మరియు ఇటాలియన్ భాషలను నేర్చుకున్న శారా, తన భర్త చేసే అనువాదాలలో సహాయకారిగా ఉండేవారు. ప్రార్థించుటకు ఎంతో క్రమబద్ధమైన కాలపట్టికను కలిగియుండే ఆమె, ‘స్త్రీల ప్రార్థనా కూడిక’ను కూడా ప్రారంభించారు. క్రైస్తవ సేవ అంటే మాటలకంటే క్రియల పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె విశ్వసించేవారు. కాబట్టి ఆమె ఆతిథ్యమిచ్చుటలో మరియు పేదలకు సేవలందించుటలో తన పరిచర్యను అభివృద్ధి చేశారు. ఆమె ఒక మిషన్ స్కూల్‌ను కూడా స్థాపించి అరబ్ అమ్మాయిలకు బోధించారు. ఆ విధముగా మూడు సంవత్సరాలపాటు మిషనరీగా పరిచర్యలో పాలుపొందిన పిమ్మట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శారా స్మిత్ పరలోక వాసస్థలములో శాశ్వత విశ్రాంతిలోకి ప్రవేశించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు క్రమబద్ధమైన ప్రార్థనా ప్రణాళికను కలిగియున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, ప్రార్థన కొరకు ఎక్కువ సమయం వెచ్చించుటకును, ఆ విధముగా చేయుటకు ఇతరులను కూడా ప్రోత్సహించుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Oct 1, 2021

    Sarah Hall | శారా హాల్

    శారా హాల్  | Sarah Hall 


    • జననం: 1803
    • మహిమ ప్రవేశం: 1845
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బర్మా


    శారా హాల్ 13 మంది పిల్లలలో జ్యేష్ఠురాలు. మంచి జ్ఞానవంతురాలైన ఆమె, నాలుగేళ్ల వయసులోనే ఏది ఇచ్చినా చదవగలిగేవారు. చాలా చిన్న వయస్సు నుండే తనకు మిషనరీ సేవ కొరకైన పిలుపు ఉన్నట్లు ఆమె భావించారు. జార్జ్ బోర్డ్‌మన్‌తో ఆమెకు వివాహం జరిగినప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఈ దంపతులు 1825వ సంll లో బర్మాకు పయనమయ్యారు. అయితే, అప్పటికి బ్రిటిష్-బర్మీస్ యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున వారు కొంతకాలం భారతదేశంలో ఉండవలసి వచ్చింది.


    భారతదేశంలో ఉన్నప్పుడు వారు భాషను అధ్యయనం చేయడంలో సమయమును సద్వినియోగపరచుకున్నారు. అక్కడ జన్మించిన వారి మొదటి కుమారుడు అక్కడే మరణించి, భూస్థాపనం చేయబడ్డాడు. చివరకు 1827వ సంll లో వారు బర్మాకు వెళ్ళగలిగారు. అక్కడ మొదటిగా అమ్హెర్స్ట్‌లో వారు తమ మిషన్‌ను స్థాపించారు. తదుపరి దానిని మౌల్‌మైన్‌కు తరలించగా, అక్కడ వారికి ‘కరెన్’ అనే గిరిజన తెగవారితో పరిచయమేర్పడింది. సామాన్యమైన చిన్నపాటి వ్యవసాయదారులైన ఈ తెగ ప్రజలు దేవుని వాక్యమును వినుటకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారు. వారిలో అనేక మంది యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసించారు. ఒక వ్యక్తి జీవితమైతే ఒక ప్రత్యేక ఆశీర్వాదమని చెప్పవచ్చు. అతను ఒక పేరొందిన నేరస్థుడు. 30కి పైగా హత్యలు చేసినట్లు అంగీకరించినవాడు. కానీ, అతను యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దేవునికి బలమైన సాక్ష్యముగా అతను నిలిచాడు. అంతేకాదు, ఒక మంచి సువార్తికుడయ్యాడు.


    బోర్డ్‌మన్ దంపతులు తరువాత టావోయ్‌కు వెళ్ళగా, అక్కడ బోర్డ్‌మన్ యొక్క ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అంతేకాక, ఆ దంపతులు తమ రెండవ బిడ్డను కూడా కోల్పోయారు. కష్టాలలోనైనా, సంతోషంలోనైనా వారు ఆత్మలను రక్షించవలెననిన గొప్ప లక్ష్యము పైనే గురియుంచి సమర్పణతో శ్రమించారు. బోర్డ్‌మన్ దంపతులు నిజమైన మార్గదర్శకులైన మిషనరీలు. వారు కాలినడకన పర్వత ప్రాంతాలలో విస్తృతంగా ప్రయాణించి అక్కడి ఆదివాసీలకు సువార్తను అందించారు. వారు అనేక లేఖన భాగములను అనువదించారు. శారా అనేక పాఠశాలలను ప్రారంభించి, వాటి ద్వారా బైబిలును బోధించారు. పిల్లల కారణంగా ఆమె మిషనరీ పనిలో ఎక్కువ సమయం గడపలేకపోయినప్పుడు ఆమె పాటలను వ్రాశారు. అన్యదేవతలను పూజించే మరొక తెగ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆమె వారి భాషను నేర్చుకొని, క్రైస్తవ రచనలను ఆ భాషలోకి అనువదించారు. 1845వ సంll లో తాను మహిమనందు ప్రవేశించు వరకు కూడా క్రీస్తు కొరకు శ్రమించి, ఎంతో సాధించిన ఒక అద్భుతమైన స్త్రీ శారా హాల్.


    ప్రియమైనవారలారా, ఈ భూమిపై దేవుని రాజ్యమును విస్తరింపజేయుటకు మీరు మీ తలాంతులను ఉపయోగిస్తున్నారా?

     "ప్రభువా, ఎటువంటి పరిస్థితులలోనైనా నేను మీకు సేవ చేయగలుగునట్లు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!" 

     దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp