Search Here

Showing posts with label H. Show all posts
Showing posts with label H. Show all posts

May 14, 2023

Hans Egede | హాన్స్ ఎగెడే

హాన్స్ ఎగెడే  గారి జీవిత చరిత్ర

  • జననం : 31-01-1686
  • మరణం : 05-11-1758
  • స్వదేశం : నార్వే
  • దర్శన స్థలము : గ్రీన్‌లాండ్‌

హాన్స్ ఎగెడే డానిష్-నార్వే లూథరన్ మిషనరీ. అతను కోపెన్‌హాగన్‌లో వేదాంతశాస్త్రమును అభ్యసించారు. తదుపరి నార్వేలోని లోఫోటెన్ దీవులలో ఉన్న ఒక చిన్న లూథరన్ సంఘమునకు పాదిరిగా నియమించబడగా, అతను ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి అక్కడి ప్రజలకు సేవ చేశారు మరియు క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరిచారు. లోఫోటెన్‌లో ఉన్న సమయంలో గ్రీన్‌లాండ్‌లో స్థిరపడి, శతాబ్దాల తరబడి మిగిలిన ప్రంపంచముతో సంబంధాలు లేనటువంటి ఓల్డ్ నార్స్ ప్రజలను గురించి పలు కథలు అతను వినడం జరిగింది. అయితే ఒక రోజు అతను తాను వారిని వెదకి కనుగొని, వారికి పాదిరిగా ఉండవలెనని తన ఆంతర్యములో ఒక స్వరమును విన్నారు. ఆ పిలుపు అతనిని ఏనాడూ విడిచిపెట్టలేదు. కాగా అతను తన భార్యతో పాటు గ్రీన్‌లాండ్‌కు వెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు. అందుకొరకై అతను అన్యజనులు ఉన్నంతవరకు సేవ చేయవలసిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉందని ఎత్తి చూపిస్తూ డానిష్ (డెన్మార్క్) రాజైన నాలుగవ ఫ్రెడరిక్ కు ఒక లేఖ వ్రాసి పంపారు. దాదాపు పదేళ్ళు వేచియుండిన తరువాత చివరకు అతను గ్రీన్‌లాండ్‌ మిషన్‌కు ఆమోదం పొందగలిగారు.


1722వ సంll లో గ్రీన్‌లాండ్‌కు వచ్చారు హాన్స్. అక్కడి ప్రజలతో అతని మొట్టమొదటి పరిచయం అంత ప్రోత్సాహకరముగా లేదు. ఏలయనగా నాగరికతలేని ఆ ప్రజలు బోధింపబడనివారు, అన్యదేవతలను పూజించేవారు మరియు కౄర స్వభావం కలిగినవారు. కాగా వారి మీద కనికరముతో చలించిన అతని హృదయం కరుణతో వారిని చేరుకొనుటకు ముందుకు వెళ్ళింది. ఆదివారమున క్రమం తప్పకుండా అతను కూడికలను నిర్వహించేవారు. ప్రారంభంలో ఆ కూడికలకు చాలా కొద్దిమంది మాత్రమే హాజరైనప్పటికీ, అతను స్థానిక భాషలో సేవచేయడం కొనసాగించడంతో ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోగలిగారు. తద్వారా అతను శ్రమించి చేసిన పరిచర్య కొంత ఫలమును చూడటం ప్రారంభమయ్యింది. కాగా అతను గ్రీన్‌లాండ్‌కు చెందిన ప్రజలలో మరింత దురుసుగా ఉండేటటువంటి వారికి కూడా బోధించగలిగారు. ప్రజలలో మశూచి తెగులు విజృంభించిన సమయములో రోగులకు సేవలందించుటకును మరియు చనిపోయినవారిని సమాధి చేయుటకును దివారాత్రుళ్ళు శ్రమించి పనిచేశారు హాన్స్. ప్రసంగాల ద్వారా కంటే ప్రేమను కనుపరిచే అటువంటి చర్యల ద్వారా మరింత సమర్థవంతంగా అతను సువార్తను ప్రకటించగలిగారు.


1758వ సంll లో మహిమలోనికి పిలవబడే వరకు కూడా హాన్స్ సువార్తను నమ్మకముగా ప్రకటించారు. అతను పరిచర్య చేసిన ప్రాంతం ఈ భూమిపైన నివసించుటకు అతి క్లిష్టమైన ప్రదేశాలలో ఒకటని చెప్పవచ్చు మరియు ఆ ప్రజలు, సువార్త ప్రకటించుటకు మిగుల కష్టతరమైన ప్రజలని చెప్పవచ్చు. అయినప్పటికీ, హాన్స్ ఎగెడే దేవుడు తనకు ఇచ్చిన పిలుపుకు విధేయత చూపించినవారై, ఆయన తనకు అప్పగించిన ప్రాంతములో తనకు అప్పగింపబడిన ప్రజల మధ్య సేవ చేయుటలో చివరి వరకూ స్థిరముగా నిలిచారు. 

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, స్థితిగతులతో నిమిత్తం లేకుండా దేవుని పిలుపుకు విధేయులుగా ఉండుటకు దృఢమైన సంకల్పమును మీరు కలిగియున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, నా ప్రయాసము మీయందు వ్యర్థముకాదనే నిరీక్షణనిచ్చినందులకై వందనములు. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Hattie Judson | హ్యాటీ జడ్సన్

    హ్యాటీ జడ్సన్  జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only




    • జననం: -
    • మహిమ ప్రవేశం: 1897
    • స్వస్థలం: డాన్విల్లే, కనెక్టికట్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    కీర్తనలు 116:15 లో బైబిలు ఇలా చెబుతోంది, “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది.” వారి త్యాగపూరితమైన జీవితముల ద్వారా యేసు క్రీస్తు ప్రభువు మహిమపరచబడ్డారు మరియు క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందింది. వారు ఎదురొంటున్న సవాళ్ళకు, పరీక్షలకు మరియు అనుభవిస్తున్న శ్రమలకు, కష్టాలకు మరణం ముగింపు తెచ్చినప్పటికీ, వారు చేసిన పరిచర్య మాత్రం ఈ లోకములో జీవించుచునే యున్నది. దేవుని పరిచర్య చేస్తూ ఆయన రాజ్యం నిమిత్తం మరణించిన అటువంటి మిషనరీలలో హ్యాటీ జడ్సన్ ఒకరు. 


    హ్యాటీ జడ్సన్ ప్రసిద్ధ మిషనరీయైన అడోనిరామ్ జడ్సన్ యొక్క దూరపు బంధువు. 1892వ సంll లో భారతదేశానికి చేరుకున్న హ్యాటీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో తన మిషనరీ పనిని ప్రారంభించారు. ప్రారంభంలో ఆమె ఆ ప్రాంతంలోని ఒక బాలికల పాఠశాలకు పర్యవేక్షకురాలిగా పని చేశారు. అలుపెరుగని ఆమె శ్రమ కారణంగా ఆమె సంరక్షణలో ఆ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. అప్పటిలో ప్రబలంగా ఉన్న భారతీయ ఆచారాల ప్రకారం తల్లిదండ్రులు సాధారణంగా చాలా చిన్న వయస్సులోనే తమ కుమార్తెలకు బలవంతముగా వివాహం చేసేవారు. అయితే వారికున్న అటువంటి మనస్తత్వాన్ని మార్చుటకు హ్యాటీ ఎంతగానో ప్రయత్నించారు మరియు వారి కుమార్తెలు మంచి భవిష్యత్తును కలిగియుండునట్లు వివాహానికి ముందు వారు వారి చదువును పూర్తి చేయుటకు అనుమతించవలెనని ఆమె భారతీయులను ప్రోత్సహించారు. ఆమె కనుపరిచే ఉత్సాహం మరియు ఆమె శ్రమ వారి కుమార్తెలను పాఠశాలకు పంపునట్లు అనేక కుటుంబాలను ప్రోత్సహించడంతో త్వరలోనే ఆ పాఠశాలలోని విద్యార్థినీల సంఖ్య 10 నుండి 37 కి పెరిగింది.


    కనికరము కలిగిన వ్యక్తిగాను మరియు ఎల్లప్పుడూ సంతోషమును కనుపరిచేవారిగాను పేరుపొందిన హ్యాటీ, తన సంరక్షణలో ఉంచబడిన ప్రభుని మందను భద్రపరచుటకు త్యాగపూరితమైన జీవితమును జీవించారు. 1897వ సంll లో మధ్య భారతదేశంలో భయంకరమైన కరువు కలిగింది మరియు తెగులు వ్యాపించింది. ఆ సమయములో సహాయ చర్యలను చేపట్టిన వారికి సహాయమందించుటకుగాను ఆమె మహోబా అనే ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మరియు పేదలకు ఆహారమందించుటలో తన శక్తినంతటినీ ఉపయోగించారు. ప్రజలు బ్రతుకుటకుగాను తన సంపాదన మొత్తాన్ని కూడా మిషన్ పనికి ఇచ్చారు హ్యాటీ. మహోబాలో ఆమె ఎంతగానో శ్రమించి సేవలను అందించగా, దాని వలన ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తత్ఫలితంగా ఆమె టైఫాయిడ్ జ్వరముతో బాధపడి, చివరికి 1897వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు. అనారోగ్యముతో బాధపడుతున్న సమయములో కూడా లేచి పిల్లలకు సంరక్షణ నందించవలెననునది ఆమెలో ఉన్న నిరంతర వాంఛ.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ సంరక్షణలో ఉంచబడిన ఆత్మల యొక్క ఆత్మీయ ప్రయోజనం కొరకు మీరు త్యాగపూరితమైన జీవితమును జీవించుచున్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, పరిశుద్ధమును మీకు అంగీకారయుతమునైన త్యాగపూరితమైన జీవితమును జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jul 25, 2022

    Hana Catherine Mullens | హనా కాథరిన్ ముల్లెన్స్

    హనా కాథరిన్ ముల్లెన్స్ జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: 01-07-1826
    • మహిమ ప్రవేశం: 21-12-1861
    • స్వస్థలం: కలకత్తా
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: భారతదేశం


    ఐరోపా ఖండమునకు చెందినవారైన హానా కాథరిన్ ముల్లెన్స్, జెనానా మిషన్లకు మార్గదర్శకురాలిగా పరిగణించబడే మిషనరీ. ఈ జెనానా పరిచర్య బహిరంగంగా కనిపించుటకు అనుమతించబడని అప్పటి భారతీయ మహిళలకు సువార్తను అందించుటకు మహిళా మిషనరీలను పంపేదిగా ఉంది. హానా ఒక పరిష్కారమును కనుగొనేంత వరకూ బంధకాలలో ఉన్నటువంటి ఈ మహిళలను చేరుకోవడం మిషనరీలకు జవాబు దొరకని ఒక గొప్ప చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.


    కలకత్తాలోని ఒక మిషనరీల కుటుంబంలో జన్మించిన హానా, ఆమె తల్లిదండ్రుల పరిచర్య ద్వారా ప్రేరణ పొందారు. మంచి తెలివితేటలు గలిగిన ఆమె, పన్నెండేళ్ళ వయసుకు ముందే తరగతులు నిర్వహించుటలో తన తల్లికి సహాయం చేసేవారు. ఆమె పదిహేనేళ్ళ ప్రాయంలో యేసు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు తన ఇంటిని సందర్శించిన ప్రతి ఒక్కరితో ఎంతో ఆసక్తి ఉత్సాహములతో సువార్తను పంచుకునేవారు. అవిశ్వాసులను క్రీస్తు వద్దకు తీసుకురావడంలో ఇతర ప్రసంగాల కంటే వారితో ఆమె కలిగియుండే సంభాషణలే వారిని బహుగా ప్రభావితం చేసివి. 19 సంll ల వయసులో రెవ. డాక్టర్ ముల్లెన్స్‌తో ఆమెకు వివాహం జరుగగా, వారిరువురు కలిసి బెంగాల్‌లో సంతోషముతో ప్రభువుకు సేవ చేశారు. బెంగాలీ భాషలో మంచి వాక్పటుత్వము కలిగియున్న ఆమె, స్థానిక మహిళల కొరకు క్రైస్తవ రచనలనలు వ్రాశారు మరియు అనువదించారు. ఆమె వ్రాసిన పుస్తకాలలో ఒకటి భారతదేశంలోని పన్నెండు భాషా మాండలికాలలో ప్రచురించబడింది. 


    భారతీయ మహిళలు దయనీయమైన స్థితిలో అజ్ఞానులుగాను, ఒంటరిగా ఏ పనీ లేకుండా, సంతోషము లేక యున్నారని ఎరిగియున్న హానా, వారి కొరకు ఏమైనా చేయాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. అటువంటి అవకాశం అనుకోని విధంగా ఆమె తలుపు తట్టింది. ఎంబ్రాయిడరీ మరియు కుట్టుపనిలోని అల్లికలలో నైపుణ్యము కలిగియున్న హానా, ఒకసారి ఒక జత చెప్పుల పై అల్లిక పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దానిని చూచి ఆశ్చర్యముతో "నా భార్య కూడా అటువంటి పనిని నేర్చుకోవాలని కోరుకుంటున్నారు" అని అన్నాడు. హానా వెంటనే ఆ అవకాశమును అందిపుచ్చుకొని, కావాలంటే ఆ పనిని అతని భార్యకు నేర్పించగలనని చెప్పారు. ఆ విధంగా, భారతీయ మహిళలకు అటువంటి నైపుణ్యాలను నేర్పించుటకే కాక, ఆత్మీయ విషయములను కూడా వారికి నేర్పించుటకు వారిని కలుసుకొనగలుగునట్లు ద్వారములు తెరువబడ్డాయి. త్వరలోనే ఆమె అటువంటి మహిళలను అనేకమందిని కలుసుకుంటూ, సువార్తను చెప్పి వారిని క్రీస్తు వద్దకు నడిపించారు.


    అయితే 35 సంll ల లేత వయస్సులోనే హానా ఈ లోకమును విడిచి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ, ఆమె చేతి వ్రేళ్ళతో నిరంతరాయంగా పనిచేసిన కుట్టు సూది జెనానా పరిచర్యకు ద్వారములు తెరిచింది. అనేకమంది ఇతర మహిళా మిషనరీలు పరిచర్య చేయుటకు ఆమె అవలంబించిన పద్ధతులను అనుసరించారు. తత్ఫలితముగా వేలాది మంది భారతీయ మహిళలు నిజమైన దేవుని యొద్దకు నడిపింపబడ్డారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీకు కలిగిన అవకాశములను సువార్త పంచుకొనుటకు ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటున్నారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా విశ్వాసమును చురుకుగా ఇతరులతో పంచుకొనుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Henry Harris Jessup | హెన్రీ హారిస్ జెస్సప్

    హెన్రీ హారిస్ జెస్సప్ జీవిత చరిత్ర



    • జననం: 1832
    • మహిమ ప్రవేశం: 1910
    • స్వస్థలం: పెన్సిల్వేనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: సిరియా మరియు లెబానోను


    అమెరికాకు చెందిన మిషనరీయైన హెన్రీ హారిస్ జెస్సప్ సిరియా మరియు లెబానోనులలో సువార్త వెలుగును తిరిగి ప్రజ్వలింపజేయుటకు దేవుడు వాడుకొనిన ఒక సాధనం. మొదటి నుండి కూడా అతని తల్లిదండ్రులు అతనిని దేవుని యొక్క వాక్యోపదేశముతో అతనిని పెంచారు. అతను 20ll సం ల వయసులో ఒక మిషనరీ సమావేశాన్ని నడిపిస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా తాను కూడా మిషనరీ కావాలనే ఆలోచన అతనికి కలిగింది. ఆ సమయంలో తాను మిషనరీగా వెళ్ళుటకు సిద్ధంగా లేకుండా ఇతరులకు మిషనరీ సేవ చేయమని చెప్పటం వేషధారితనమని అతనికి తోచింది. కాగా అతను దేవుడు ఏ స్థలమునకు తీసుకువెళ్ళినా అక్కడికి వెళ్ళి సేవచేయవలెనని ప్రార్థనాపూర్వకముగా తనను తాను సమర్పించుకున్నారు.


    తత్ఫలితముగా 1856వ సంll లో సిరియాలోని స్ముర్న చేరుకున్నారు హెన్రీ. ‘ఏమి మేలు చేయగలం?’ మరియు ‘దానిని ఏ విధంగా చేయవచ్చు?’ అనే రెండు ప్రశ్నలు పునాదులుగా అక్కడ అతని పరిచర్య స్థాపించబడింది. తద్వారా, పాఠశాలలను స్థాపించడం, బైబిలు అనువాదం, ప్రసంగించడం మరియు క్రైస్తవ రచనలను ప్రచురించడం మొదలగు సేవలు ప్రారంభమయ్యాయి. అక్కడ హెన్రీ మరియు అతని సహచరులు ‘బైబిల్ మెన్’ (బైబిలు మనుషులు) అని పిలువబడేవారు. వారి పట్ల స్థానిక ఇస్లాం షేక్‌లు ద్వేష భావమును కలిగియుండేవారు. క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య తరచూ జరిగే యుద్ధాల కారణంగా హెన్రీ ప్రాణాలకు అక్కడ నిరంతరం ముప్పు పొంచి ఉండేది. అక్కడి ముస్లింలు "మా హాలా, మా హాలా, కోట్లెన్ నసరా!", అనగా "ఎంత మధురం, ఎంత మధురం, క్రైస్తవులను చంపడం!" అని పాడేవారు. తన చుట్టూ ఉన్న సహపరిచారకులు మరియు విశ్వాసులు చంపబడుతున్నప్పటికీ, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా అతను స్థిరముగా నిలబడి, నలభై సంవత్సరాలకు పైగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయారు. 


    అరబ్బు దేశాలలో మిషనరీ పనిని చేపట్టుటకు ఎంతో మంది మిషనరీలను ప్రభావితం చేయడంలో హెన్రీ ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. స్వదేశంలో కూడా సిరియాలోని మిషనరీ సేవ వైపుకు మరియు సిరియా ప్రజల అవసరతల వైపుకు ప్రజల దృష్టిని మరల్చుటకై అతను తాను చేయగలిగినదంతా చేశారు. సిరియాకు వెళ్ళేముందు నెవార్క్‌లో ఒక గొప్ప పిల్లల సమూహముతో మాట్లాడిన అతను, ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఒక తీర్మానం వ్రాయమని వారిని ఎంతగానో కోరారు. అదేమనగా, "దేవుడు నాకు కృపననుగ్రహించినట్లయితే నేను ఒక మిషనరీ అవుతానని తీర్మానించుకుంటున్నాను." ఆ సమూహంలో ఉన్న పిల్లలలో ఒకరు అరబ్బు దేశాలలో చెప్పుకోదగ్గ గొప్ప మిషనరీ పరిచర్యను జరిగించిన డాll జేమ్స్ డెన్నిస్!


    సమర్పణ మరియు దీనత్వములను కలిగిన మిషనరీగా తాను సాధించినవాటి నుండి తనకు ఎటువంటి ఘనతనూ ఆశించని హెన్రీ హారిస్ జెస్సప్, 1910వ సంll లో ఈ లోకములో తన యాత్రను ముగించి ప్రభు సన్నిధానమును చేరుకున్నారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు ఏమి బోధించుచున్నారో దానిని మీరు ఆచరించుచున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నీవు నాకు కృపననుగ్రహించినట్లయితే నేను ఒక మిషనరీ అవుతానని తీర్మానించుకుంటున్నాను ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Herman Reynolds | హెర్మన్ రేనాల్డ్స్

    హెర్మన్ రేనాల్డ్స్ జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: వెస్ట్ వర్జీనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    హెర్మన్ రేనాల్డ్స్ మధ్య భారతదేశంలో సేవచేసిన ఒక అమెరికన్ మిషనరీ. ‘లించ్‌బర్గ్ క్రిస్టియన్ కాలేజీ’ నుండి పట్టభద్రులైన అతను, తరువాత సేవ కొరకైన శిక్షణ నిమిత్తం వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో చేరారు. మిషనరీ సేవ కొరకైన భారం కలిగియున్న మిల్డ్రెడ్ ప్రిట్చెట్‌తో అతనికి వివాహం జరుగగా వారిరువురూ కలిసి ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్‌’ కు వెళ్ళారు. అక్కడ వారు ఒకవైపు మిషనరీ సేవ కొరకు సిద్ధమవుతూ, మరొకవైపు యేల్‌లో పాదిరి పరిచర్యను చేశారు. తదుపరి వారు పరిశుద్దాత్మ చేత నడిపించబడినవారై 1927వ సంll లో ఇండియన్ మిషన్‌లో చేరారు. తద్వారా, మధ్య భారతదేశంలోని జబల్‌పూర్ అనే ప్రదేశానికి చేరుకున్న ఈ మిషనరీ దంపతులు, స్థానిక భాషను  అభ్యసించుటలో కొంత కాలం గడిపిన పిమ్మట,  ఛత్తీస్‌గడ్‌లోని కోట్మి వద్ద ఉన్న క్రొత్త మిషన్ స్టేషన్‌కు వెళ్ళారు.


    అభివృద్ధి చెందని అనాగరికులు మరియు నిరక్షరాస్యులు అయినటువంటి కోట్మిలోని ప్రజలకు సువార్తను అందించడం బహు కష్టతరమైనది. అయినప్పటికీ, హెర్మన్ ఒక స్నేహితునిగా వారి మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అతను గ్రామ శివార్లలో తన గుడారాన్ని వేసుకొని, అవకాశం వచ్చినప్పుడల్లా తన భార్యతో కలిసి గ్రామస్థులను వారి గృహములలో సంధించేవారు. హెర్మన్ లేఖనములను బోధిస్తూ మరియు క్రియారూపకముగా పలు వృత్తిసంబంధ నైపుణ్యములను నేర్పిస్తూ పురుషుల మధ్య సేవజరిగించగా, మహిళలు మరియు పిల్లల యొక్క నమ్మకమును గెలుచుకున్న మిల్డ్రెడ్, వారికి గృహసంబంధమైన నైపుణ్యములను నేర్పించారు. అంతేకాకుండా వారిరువురూ కలిసి ఒక పాఠశాలను మరియు ఔషధాలయమును తెరిచారు మరియు ఆ ప్రాంతము యొక్క సామాజిక స్థితిగతులను మెరుగుపరిచారు. దేవుడు వారి పరిచర్యను ఆశీర్వదించగా అనేకమంది క్రీస్తు వైపుకు ఆకర్షించబడ్డారు. తదుపరి కొంత కాలం పాటు ముంగేలికి వెళ్ళి సత్నామి ప్రజల మధ్య ఎంతో తీవ్రతతో సువార్త సేవ చేశారు హెర్మన్. పిమ్మట కోట్మికి తిరిగి వెళ్ళి, అక్కడి తన మిషనరీ కార్యకలాపాలను కొనసాగించారు. 


    దేవుని ప్రేమను రుచి చూసినవారు పనిచేయకుండా ఊరికే కూర్చొనలేరు. అపొస్తలుడైన పౌలు 2 కోరింథీ 5:14లో ఇలా చెప్పారు – “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది…” అటువలెనే హెర్మన్, తాను స్వదేశానికి వెళ్ళి వచ్చే కొద్దిపాటి పర్యటనలలో కూడా అమెరికాలో క్రైస్తవ సంఘ ప్రయోజనం కొరకు నిరంతరం పని చేశారు. మిన్నెసోటాలో ప్రార్థనా మందిర నాయకునిగా సేవ చేశారు మరియు తన లోతైన ప్రసంగాల ద్వారా అమెరికాలోని క్రైస్తవ సంఘ విశ్వాసులను  ప్రోత్సహించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకు క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతము చేయుచున్నదా? 


    ప్రార్థన :

    "ప్రభువా, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Hope Masterton Waddell | హోప్ మాస్టర్టన్ వాడెల్

    హోప్ మాస్టర్టన్ వాడెల్ జీవిత చరిత్ర




    • జననం: 14-11-1804
    • మహిమ ప్రవేశం: 18-04-1895
    • స్వస్థలం: డబ్లిన్
    • దేశం: ఐర్లాండ్
    • దర్శన స్థలము: జమైకా మరియు నైజీరియా


    ఐర్లాండుకు చెందిన హోప్ మాస్టర్టన్ వాడెల్, జమైకా మరియు నైజీరియాలలో సేవ చేసిన ఒక వైద్య మిషనరీ. తన చిన్ననాటి నుండే దేవుని సేవ చేయాలనే బలమైన వాంఛ అతనిలో ఉన్నప్పటికీ, అతను కలిగియున్న మాట మాంద్యము అందుకు అడ్డంకిగా నిలిచింది. అయితే, లక్షలాది మంది ఇశ్రాయేలీయులను నడిపించుటకు నోటి మాంద్యము గల మోషేను వాడుకొనగలిగిన దేవుడు, వాడెల్‌ను కూడా వాడుకొనగలడు కాదా? అవును! వాడెల్ ఒక మందుల షాపులో సహాయకునిగా పనిచేస్తున్నప్పుడు మిషనరీ సేవ చేయుటకు దేవుడు అతనికి ఒక మార్గమును తెరిచాడు. కాగా ఈడెన్‌బర్గ్‌లో సేవ కొరకైన శిక్షణ పొందిన తరువాత ‘స్కాటిష్ మిషనరీ సొసైటీ’ మిషనరీ సేవ చేయుటకు అతనిని జమైకాకు పంపింది.


    “ఐరోపావారి సమాధి” అని పిలువబడే జమైకా సేవ చేయుటకు మిగుల కష్టతరమైన ప్రదేశమని చెప్పవచ్చు. ఒకవైపు అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక సవాలుగా నిలిస్తే, మరొకవైపు బానిస వ్యాపారమే ఆధారముగా నడిపించబడుచున్న సామాజిక పరిస్థితులు మరొక సవాలుగా మారాయి. వాడెల్ జమైకా యొక్క నలుమూలలకూ ప్రయాణించి అక్కడ స్థానికముగా ఉన్న అవసరతలను అర్థం చేసుకున్నారు. చివరకు కార్న్‌వాల్ వద్ద ఒక మిషన్ స్టేషన్‌ను స్థాపించిన అతను, అక్కడ బానిసల మధ్య పరిచర్య చేసి క్రీస్తులో దొరికే స్వాతంత్య్రమును అనుభవించునట్లు వారిలో అనేకమందికి సహాయం చేశారు. అయితే 1839వ సంవత్సరపు బానిసల తిరుగుబాటు వలన భయాందోళనకరమైన పరిస్థితులను కూడా అతను ఎదుర్కొనవలసి వచ్చింది. ఏలయనగా, పరదేశులుగా అక్కడికి వచ్చి ఆక్రమించుకొని నాయకత్వమును చేజిక్కించుకున్నవారు (కొలోనియలిస్టులు) స్వేచ్ఛ సమానత్వాల గురించిన ఆలోచనలను బానిసలకు కలిగిస్తున్నావంటూ అతనిని నిందించారు. అయినప్పటికీ, అనేక సవాళ్ళతో కూడిన పరిస్థితుల మధ్య కూడా బానిసలకు మరియు యజమానులకు ఇరువురికీ క్రీస్తు ప్రేమను చూపించారు వాడెల్. 


    జమైకాలో 16 సంll ల పాటు పరిచర్య చేసిన తరువాత, నైజీరియాలోని కాలాబార్‌లో సేవ చేయుటకు అతను నియమించబడ్డారు. కాగా సంతోషముగా మరికొందరు మిషనరీలతో కలిసి 1846వ సంll లో కాలాబార్ చేరుకున్నారు వాడెల్. తదుపరి అతను ఎంతో అధికముగా మంత్రవిద్యను అభ్యసించే ప్రజలు గల క్రీక్ టౌన్ నగరములో స్థిరపడ్డారు. అక్కడ అతను మంత్రవిద్య, బహుభార్యాత్వం, నరబలి మరియు శిశుహత్య వంటి చెడు సామాజిక పద్ధతులను అంతం చేయుటకు ఎంతో కృషి చేశారు. రాజైన ఇయో యొక్క నమ్మకాన్ని సంపాదించగలిగిన వాడెల్, అతనికి పది ఆజ్ఞలను నేర్పించగా, ఆ ఆజ్ఞల ఆధారంగా ఇయో రాజు కాలాబార్ సమాజమును పూర్తిగా సంస్కరించాడు. ఒక వైద్య నిపుణుడైన వాడెల్, అక్కడ యెల్లో ఫీవర్ అనే జ్వరము వ్యాప్తి చెందకుండా ఉండుటకు కూడా ఎంతో శ్రమించారు. అతని మిషనరీ సేవా కార్యకలాపాలు అరోచుక్వు, ఓహాఫియా, అబిరిబా మరియు అఫిక్పో వంటి ఇతర ప్రాంతములకు కూడా వ్యాపించాయి.


    కాలాబార్‌లో 12 సంll ల పాటు తీవ్రముగా మిషనరీ పరిచర్య జరిగించిన తరువాత తన స్వదేశానికి తిరిగి వెళ్ళిన హోప్ మాస్టర్టన్ వాడెల్, 1895వ సంll లో తాను మరణించేంత వరకు కూడా అక్కడ పరిచర్య చేస్తూ ప్రభు సేవలో ముందుకు సాగిపోయారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు శారీరక లోటుపాట్లను కలిగియున్నప్పటికీ మిమ్ములను వాడుకొనుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే సేవ చేయుటకు మీరు సిద్ధమేనా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా బలహీనతలలో మీ బలము పరిపూర్ణమగునట్లు చేసి, మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Apr 7, 2022

    Henry Martyn | హెన్రీ మార్టిన్

    హెన్రీ మార్టిన్ జీవిత చరిత్ర




    • జననం : 18-02-1781
    • మరణం : 16-10-1812
    • స్వస్థలం : కార్న్‌వాల్
    • దేశం  : ఇంగ్లాండు 
    • దర్శన స్థలము : భారతదేశం, పర్షియా (ప్రస్తుత ఇరాన్)


    ఒక ఆంగ్లేయ పాదిరియైన హెన్రీ మార్టిన్ భారతదేశం మరియు పర్షియా దేశాలలో మిషనరీగా సేవలందించారు. అతని తండ్రియైన జాన్ మార్టిన్ గనులలో పనిచేసేవారు. పుట్టిన కొద్దికాలానికే తల్లిని కోల్పోయిన హెన్రీని అతని తండ్రే పెంచారు. తన యవ్వనప్రాయంలో కోపస్థునిగా హింసాత్మక స్వభావాన్ని హెన్రీ కలిగియున్నారు. కాగా ఒకసారి అతను కోపంతో అతని స్నేహితుని పైకి కత్తిని విసిరి దాదాపు ఆ వ్యక్తిని చంపినంత పనిచేశారు. అయితే, అతని తండ్రి మరణం అతని వైఖరిని పూర్తిగా మార్చివేసింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్ కళాశాలలో చదువుకున్న అతను గణితశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో సువార్తికునిగా సేవచేస్తున్న చార్లెస్ సిమియోన్‌తో హెన్రీ కలిగియున్న సహవాసం అతను విశ్వాసములో ఎదుగుటకు తోడ్పడింది.


    డేవిడ్ బ్రైనర్డ్ మరియు విలియం కేరీల సాక్ష్యాలతో ప్రేరణ పొందిన హెన్రీ, విద్యారంగంలో కీర్తి సంపాదించాలనే తన ఆశయాలను పక్కన పెట్టి, క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించిన సందేశాన్ని విదేశాలకు మోసుకువెళ్ళే రాయబారిగా మారారు. కావున ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింద ప్రార్థనాలయ అధికారిగా పనిచేయుటకు అంగీకరించి, 1806వ సంll లో భారతదేశానికి వచ్చారు. మొదట సెరాంపూర్ చేరుకున్న అతను, తరువాత దానాపూర్ వెళ్ళారు. అతిత్వరలోనే అతను స్థానిక భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలను నేర్చుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తోటి మిషనరీల ప్రోత్సాహంతో బైబిలు అనువాదాన్ని తన ప్రధాన కర్తవ్యముగా ఎంచుకున్నారు హెన్రీ. భారతీయ ముస్లింలకు సువార్తను అందించుటకు ఏదైనా మంచి ప్రయత్నం చేయవలెనని తలంచిన అతను, క్రొత్త నిబంధనను మరియు ఆంగ్లికన్ ప్రార్థన పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించారు. అంతేకాకుండా పిల్లలకు కూడా తన సేవలనందించి, వారి కొరకు పాఠశాలలను ఏర్పాటు చేశారు.


    అటు పిమ్మట ముస్లిం ప్రజలకు సువార్తను అందించుటకు మరింతగా సేవ చేయవలెనని సంకల్పించి 1810వ సంll లో అతను పర్షియా (ఆధునిక ఇరాన్) కు వెళ్ళారు. తన ఆరోగ్య స్థితి మరింత దిగజారుతున్నప్పటికీ లెక్కచేయకుండా అతను క్రొత్త నిబంధనను పర్షియా మరియు అరబిక్ భాషలలోకి అనువదించారు. తదుపరి అర్మేనియావారి మధ్య సేవ చేయాలని వాంఛించిన అతను 1812వ సంll లో గుర్రంపై కాన్‌స్టాంటినోపుల్‌కు బయలుదేరారు. అయితే 1300 మైళ్ల ఆ దూర ప్రయాణం ముగియబోతుందనగా అతను పూర్తిగా కృశించి పోవడంతో 31 సంll ల అతి చిన్న వయస్సులోనే అతను తుది శ్వాస విడిచారు. హెన్రీ మార్టిన్ ఒక ప్రార్థనా యోధులు. అతను తన జీవితమంతా లేఖనములపైనే ఆధారపడి దేవుని వాక్యములోనే తనకు విశ్రాంతిని ఆదరణను వెతికారు. తాను నిర్వర్తించవలసిన పనుల పట్ల అతను కలిగియున్న శ్రద్ధ మరియు దేవుని గురించిన కార్యముల పట్ల ఉన్న ఆసక్తి ఆ కాలపు అత్యంత గొప్ప మిషనరీలలో ఒకరిగా అతనిని నిలిపాయి.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ యవ్వనంలో ప్రభువు కొరకు మీరేమి సాధించారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, నా పూర్ణ శక్తిని మరియు బలమును మిమ్ములను సేవించుట కొరకే ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!



  • WhatsApp
  • Horace Underwood | హోరేస్ అండర్‌వుడ్

    హోరేస్ అండర్‌వుడ్ జీవిత చరిత్ర

     


    • జననం : 19-07-1859
    • మరణం : 12-10-1916
    • స్వస్థలం : లండన్
    • దేశం   : ఇంగ్లాండు
    • దర్శన స్థలము : కొరియా


    లండన్ నగరంలో జన్మించిన హోరేస్ గ్రాంట్ అండర్‌వుడ్, 1872వ సంll లో తన కుటుంబంతో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కు వలస వెళ్ళారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ లో పట్టా పొందిన తరువాత అతను న్యూ బ్రున్స్విక్‌లో ఉన్న 'డచ్ రిఫార్మ్‌డ్ థియోలాజికల్ సెమినరీ' అనే వేదాంత కళాశాలలో చేరారు. 1884వ సంll లో సేవ చేయుటకు అర్హత పొందిన అతను, మిషనరీగా భారతదేశానికి వెళ్ళాలని ఆశించారు. అయితే, కొరియాలో సువార్త సేవ కొరకు ఎంత అవసరం ఉన్నదో దేవుడు అతనితో మాట్లాడగా, 'ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ మిషన్స్' సంస్థను ఒప్పించి, అండర్‌వుడ్ కొరియాకు పయనమయ్యారు. సిలువ సందేశాన్ని కొరియన్లకు అందించాలనే ఆతృతతో అతని ప్రయాణం సాగింది.

    మిగిలిన ప్రపంచంతో సంబంధాలను మూసివేసుకున్నదిగా ‘హెర్మిట్ రాజ్యం’ అని కూడా పిలువబడే కొరియా బయటి వ్యక్తులను సులభముగా అంగీకరించలేని తత్వం, వారిని సహించలేనితత్వం కలిగి ఉండేది. అయితే కొరియావారు నేర్చుకొనుటను ఎంతో గొప్పదిగా ఎంచుతారని, పుస్తకాలు వారికి బహు విలువైనవని అర్థం చేసుకున్న అండర్‌వుడ్, అటువంటి కొంతమందికి క్రైస్తవ పుస్తకములను అవి ఏమిటో బహిరంగముగా తెలియపరచకుండా రహస్యముగా పంపించడం ప్రారంభించారు. కొన్నిసార్లు అతను రాకపోకలు అధికముగా ఉండే వీధి ప్రక్కన ఏదైనా చెట్టు క్రింద కూర్చుని, ఒక పుస్తకం తీసి చదవడం ప్రారంభించేవారు. అది చూసిన వారెవరైనా ఏమి చదువుతున్నారని అతనిని అడిగినప్పుడు, అది అవకాశంగా తీసుకొని అతను వారికి ఆ పుస్తకమును గురించి, దానిలో వ్రాయబడిన సత్యాలు మరియు వాటి భావమును గురించి వివరించి చెప్పేవారు. క్రమంగా అంధకారమయమైన కొరియాలో వెలుగు ప్రకాశించడం అతను చూడగలిగారు. 1887వ సంll లో విశ్వాసుల కొరకు అతను కొరియా యొక్క మొట్టమొదటి క్రమబద్ధమైన సంఘమును స్థాపించారు. అటు పిమ్మట అతను కొరియా అంతటా మిషనరీ ప్రయాణాలను సాగించి, సువార్త ప్రకటిచుచూ, సంఘములను స్థాపిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.

    "ప్రజల చేతిలో ఉన్న బైబిలు ఉత్తమ బోధను చేయగలదు" అని విశ్వసించారు అండర్‌వుడ్. అప్పటిలో కొరియా భాషలో అందుబాటులో ఉన్న బైబిలు అనువాదం పూర్తిగా కొరియా భాషను కలిగియుండక అనేక చైనా అక్షరాలను కలిగియున్నది. కాగా అండర్‌వుడ్ ఒక అనువాద బృందంతో కలిసి ఎడతెగని కృషి సల్పి, ఖచ్చితమైన కొరియా భాషలో 1906వ సంll లో క్రొత్త నిబంధనను మరియు 1911వ సంll లో పాత నిబంధనను ప్రచురించారు. అంతేకాకుండా, కొరియా నిఘంటువును, కీర్తన పుస్తకమును మరియు అనేక క్రైస్తవ రచనలను కూడా అతను ప్రచురించారు. వేలాదిమంది కొరియా ప్రజలు క్రీస్తును అంగీకరించగా, అండర్‌వుడ్ 1900వ సంll లో సియోల్ వైఎంసిఎ ("సియోల్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్"-సియోల్ క్రైస్తవ యువకుల సంఘము)-ను స్థాపించి, భవిష్యత్ పరిచర్య కొరకై యువకులకు శిక్షణనిచ్చారు. అనేక విద్యా సంస్థలను స్థాపించడమే కాకుండా, సమాజ అభ్యున్నతి కొరకు పలు స్వచ్ఛంద గృహాలను కూడా అతను ఏర్పరిచారు. 'మండుచున్న మోపు' అని అర్ధమిచ్చే "పుల్ తోంగారి" అని పిలువబడే హోరేస్ అండర్‌వుడ్, ఎంతో మంది జీవితాలలో సత్యమనే వెలుగును నింపుతూ తన తుది శ్వాస విడిచే వరకూ క్రీస్తు కొరకు ప్రజ్వలిస్తూనే ఉన్నారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుని కొరకు మండే ప్రకాశవంతమైన జ్వాలవలె మీ స్నేహితుల మధ్యలో మీరు ప్రజ్వలిస్తున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, మీ సేవ నిమిత్తమై నేను కలిగియున్న కృపావరమును ప్రజ్వలింపజేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    Helen Roseveare Life History

    హెలెన్ రోజ్‌వేర్ జీవిత చరిత్ర





    • జననం: 21-09-1925
    • మహిమ ప్రవేశం: 07-12-2016
    • స్వస్థలం: హెర్ట్‌ఫోర్డ్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆఫ్రికా

     కాంగో దేశ చరిత్రలో ఒక గొప్ప అంతర్యుద్ధం నెలకొన్న సమయంలో హెలెన్ రోజ్‌వేర్ ఒక వైద్య మిషనరీగా అక్కడికి వెళ్ళి సేవలందించారు. ఒకసారి వారి సండే స్కూలు ఉపాధ్యాయురాలు భారతదేశం గురించి వారికి చెప్పినప్పుడు ఆ చిన్న వయస్సులోనే మిషనరీ అవ్వాలనే కోరిక ఆమెలో తలెత్తింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అక్కడ విద్యార్థుల కొరకు ఏర్పరచబడిన ఒక కూడికలో ఆమె యేసు క్రీస్తును అంగీకరించారు. ఆ కూడికల చివరి రోజున ఆమె తన సాక్ష్యాన్ని పంచుకొనగా, గ్రాహం స్క్రోగ్గీ అనే వాక్య ఉపదేశకులు ఆమె యొక్క క్రొత్త బైబిలులో ఫిలిప్పి 3:10వ వచనమును వ్రాసి, "ఈ రాత్రి నీవు ఈ వచనము యొక్క మొదటి భాగమైన 'ఆయనను ఎరుగు నిమిత్తము' అనే ఘట్టంలోనికి ప్రవేశిస్తున్నావు. అయితే నీవు ఈ వచనంలో ఇంకా ముందుకు సాగి 'ఆయన పునరుత్థానబలమును' మరియు 'ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తము' అనే అనుభవములలో కూడా ప్రవేశింపవలెనని నిన్ను గూర్చిన నా ప్రార్థన." అని చెప్పారు. తదుపరి ఆమెలో మిషనరీ సేవకైన పిలుపును గూర్చి మిగుల భారం ఏర్పడటంతో ఒకసారి దేవునితో "నన్ను క్రీస్తువలె చేయుము, అందుకొరకు ఎంతటి క్రయము చెల్లించుటకైనా సిద్ధమే" అని చెప్పారు.

     1953వ సంllలో ఈశాన్య కాంగోలోకి అడుగుపెట్టిన 28 సంllల హెలెన్ అక్కడ ఒక వైద్యశాలను మరియు నర్సుల కొరకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తరువాత 1955వ సంllలో నెబోబోంగోలోని విడిచిపెట్టబడిన ఒక ప్రసూతి మరియు కుష్ఠు వ్యాధి కేంద్రానికి ఆమె బదిలీ చేయబడగా, ఆమె ఆ కుష్ఠు రోగుల కేంద్రాన్ని ఒక వైద్యశాలగా అభివృద్ధిపరిచారు. బైబిలు గ్రంథములో వైద్యునిగా పేర్కొనబడిన లూకాను బట్టి ఆమె 'మామా లూకా' (లూకా అమ్మ) అని పిలువబడ్డారు. 

     కాంగో స్వాతంత్య్రం పొందిన తరువాత, 1964వ సంllలో అక్కడ ఒక అంతర్యుద్ధం విజృంభించింది. ఆ సమయంలో హెలెన్ చెరసాలలో వేయబడి కౄరంగా కొట్టబడటమే కాకుండా దారుణమైన అత్యాచారానికి కూడా గురయ్యారు. ఐదు నెలల తర్వాత విడుదల పొందిన ఆమె అతి త్వరలోనే లైంగిక వేధింపులకు గురైన అవమానాన్ని అధిగమించారు. పైగా, ఆమె తన యొక్క అనుభవాలను అటువంటి పరిస్థితుల గుండా వచ్చిన వారిని ప్రోత్సహించుటకు ఉపయోగించారు. ఆమె చేసిన పరిచర్య ద్వారా అనేకులు శారీరక, మానసిక మరియు ఆత్మీయ స్వస్థతను పొందుకున్నారు.

    1966వ సంllలో తిరిగి కాంగోకు వచ్చిన హెలెన్ 1973వ సంll వరకు అక్కడ సేవలందించారు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిన తరువాత తన మిగిలిన జీవితాన్ని ఒక మిషనరీ ఆలోచనకర్తగా సేవలందిస్తూ గడిపిన ఆమె అనేక పుస్తకాలను కూడా రచించారు. కల్వరి సిలువలోని గొప్ప త్యాగానికి ముందు తన శ్రమలు ఎన్నతగినవి కావని భావించిన హెలెన్ రోజ్‌వేర్ క్రీస్తు యొక్క శ్రమలలో కొంచెమైనా పాలిభాగస్థురాలవటం ఒక గొప్ప భాగ్యముగా ఎంచారు.

    ప్రియమైనవారలారా, క్రీస్తు నిమిత్తమై శ్రమలను అనుభవించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    ప్రభువా, క్రీస్తు శ్రమలలో పాలుపంచుకునే భాగ్యాన్ని అపేక్షించులాగున నన్ను సిద్ధపరచుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 10, 2021

    Helen Roseveare Life History

    హెలెన్ రోజ్‌వేర్ గారి జీవిత చరిత్ర



    • జననం: 21-09-1925
    • మహిమ ప్రవేశం: 07-12-2016
    • స్వస్థలం: హెర్ట్‌ఫోర్డ్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆఫ్రికా

     కాంగో దేశ చరిత్రలో ఒక గొప్ప అంతర్యుద్ధం నెలకొన్న సమయంలో హెలెన్ రోజ్‌వేర్ ఒక వైద్య మిషనరీగా అక్కడికి వెళ్ళి సేవలందించారు. ఒకసారి వారి సండే స్కూలు ఉపాధ్యాయురాలు భారతదేశం గురించి వారికి చెప్పినప్పుడు ఆ చిన్న వయస్సులోనే మిషనరీ అవ్వాలనే కోరిక ఆమెలో తలెత్తింది. 

    కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అక్కడ విద్యార్థుల కొరకు ఏర్పరచబడిన ఒక కూడికలో ఆమె యేసు క్రీస్తును అంగీకరించారు. ఆ కూడికల చివరి రోజున ఆమె తన సాక్ష్యాన్ని పంచుకొనగా, గ్రాహం స్క్రోగ్గీ అనే వాక్య ఉపదేశకులు ఆమె యొక్క క్రొత్త బైబిలులో ఫిలిప్పి 3:10వ వచనమును వ్రాసి, "ఈ రాత్రి నీవు ఈ వచనము యొక్క మొదటి భాగమైన 'ఆయనను ఎరుగు నిమిత్తము' అనే ఘట్టంలోనికి ప్రవేశిస్తున్నావు. అయితే నీవు ఈ వచనంలో ఇంకా ముందుకు సాగి 'ఆయన పునరుత్థానబలమును' మరియు 'ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తము' అనే అనుభవములలో కూడా ప్రవేశింపవలెనని నిన్ను గూర్చిన నా ప్రార్థన." అని చెప్పారు. తదుపరి ఆమెలో మిషనరీ సేవకైన పిలుపును గూర్చి మిగుల భారం ఏర్పడటంతో ఒకసారి దేవునితో "నన్ను క్రీస్తువలె చేయుము, అందుకొరకు ఎంతటి క్రయము చెల్లించుటకైనా సిద్ధమే" అని చెప్పారు.

     1953వ సంllలో ఈశాన్య కాంగోలోకి అడుగుపెట్టిన 28 సంllల హెలెన్ అక్కడ ఒక వైద్యశాలను మరియు నర్సుల కొరకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తరువాత 1955వ సంllలో నెబోబోంగోలోని విడిచిపెట్టబడిన ఒక ప్రసూతి మరియు కుష్ఠు వ్యాధి కేంద్రానికి ఆమె బదిలీ చేయబడగా, ఆమె ఆ కుష్ఠు రోగుల కేంద్రాన్ని ఒక వైద్యశాలగా అభివృద్ధిపరిచారు. బైబిలు గ్రంథములో వైద్యునిగా పేర్కొనబడిన లూకాను బట్టి ఆమె 'మామా లూకా' (లూకా అమ్మ) అని పిలువబడ్డారు. 

     కాంగో స్వాతంత్య్రం పొందిన తరువాత, 1964వ సంllలో అక్కడ ఒక అంతర్యుద్ధం విజృంభించింది. ఆ సమయంలో హెలెన్ చెరసాలలో వేయబడి కౄరంగా కొట్టబడటమే కాకుండా దారుణమైన అత్యాచారానికి కూడా గురయ్యారు. ఐదు నెలల తర్వాత విడుదల పొందిన ఆమె అతి త్వరలోనే లైంగిక వేధింపులకు గురైన అవమానాన్ని అధిగమించారు. పైగా, ఆమె తన యొక్క అనుభవాలను అటువంటి పరిస్థితుల గుండా వచ్చిన వారిని ప్రోత్సహించుటకు ఉపయోగించారు. ఆమె చేసిన పరిచర్య ద్వారా అనేకులు శారీరక, మానసిక మరియు ఆత్మీయ స్వస్థతను పొందుకున్నారు.

     1966వ సంllలో తిరిగి కాంగోకు వచ్చిన హెలెన్ 1973వ సంll వరకు అక్కడ సేవలందించారు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిన తరువాత తన మిగిలిన జీవితాన్ని ఒక మిషనరీ ఆలోచనకర్తగా సేవలందిస్తూ గడిపిన ఆమె అనేక పుస్తకాలను కూడా రచించారు. కల్వరి సిలువలోని గొప్ప త్యాగానికి ముందు తన శ్రమలు ఎన్నతగినవి కావని భావించిన హెలెన్ రోజ్‌వేర్ క్రీస్తు యొక్క శ్రమలలో కొంచెమైనా పాలిభాగస్థురాలవటం ఒక గొప్ప భాగ్యముగా ఎంచారు.

    ప్రియమైనవారలారా, క్రీస్తు నిమిత్తమై శ్రమలను అనుభవించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

    "ప్రభువా, క్రీస్తు శ్రమలలో పాలుపంచుకునే భాగ్యాన్ని అపేక్షించులాగున నన్ను సిద్ధపరచుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక !
  • WhatsApp
  • Nov 11, 2021

    Henry Watson Fox | హెన్రీ వాట్సన్ ఫాక్స్

    హెన్రీ వాట్సన్ ఫాక్స్  | Henry Watson Fox





    • జననం: 01-10-1817
    • మహిమ ప్రవేశం: 14-10-1848
    • స్వస్థలం: వెస్టో, డర్హామ్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శనము: తెలుగు ప్రజలు, భారతదేశం

     హెన్రీ వాట్సన్ ఫాక్స్ 1817వ సంll లో ఇంగ్లాండులోని వెస్టోలో జన్మించారు. డర్హామ్ గ్రామర్ స్కూలులో చదువుకొనిన అతను, విద్యాభ్యాసమును కొనసాగించుటకు యుక్త వయస్సులో రగ్బీ స్కూలుకు వెళ్ళారు. అతను రగ్బీ స్కూలులో చదువుకుంటున్న రోజులలో అప్పుడే వృద్ధి చెందుతున్న అతని క్రైస్తవ విశ్వాసం బలపడింది. ఏలయనగా, ఆ పాఠశాల ప్రార్థనా మందిరంలో డాll ఆర్నాల్డ్ ఇచ్చే క్రైస్తవ విలువల యొక్క సరళమైన బోధన హెన్రీ హృదయంపై లోతైన ముద్ర వేసింది. అంతేకాకుండా హెన్రీ నివసిస్తున్న ఇంటి యజమానియైన బోనమీ ప్రైస్ చేసిన ఒక ఉపన్యాసం అతని క్రైస్తవ మత విశ్వాసమును పటిష్ఠ పరిచింది. ఆక్స్‌ఫర్డ్‌లోని వధమ్ కాలేజీలో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన పిమ్మట, 1840వ సంll డిసెంబరు మాసంలో డీకనుగా నియామక అభిషేకం పొందారు హెన్రీ. తదుపరి 1841వ సంll లో చర్చి మిషనరీ సొసైటీ అతనిని భారతదేశంలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు ప్రజలకు మిషనరీగా నియమించింది.

    తన భార్యయైన ఎలిజబెత్ మరియు మరొక మిషనరీ ఆర్. టి. నోబెల్‌తో కలిసి 1841వ సంll జూలై మాసంలో మద్రాసు చేరుకున్నారు హెన్రీ. మచిలీపట్నంలో ఒక పాఠశాలను నడిపించిన నోబెల్, ఉన్నత కులాల ప్రజలపై దృష్టి కేంద్రీకరించగా, బోధించు పరిచర్యను చేపట్టిన హెన్రీ, తక్కువ కులాల వారిపై దృష్టి నిలిపారు. అతను సంచరించుచూ సువార్తను ప్రకటించుటను మొదలుపెట్టి గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించారు. అతను మచిలీపట్నం మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో మాత్రమే కాకుండా తూర్పు గోదావరి ప్రాంతం మరియు పశ్చిమ కృష్ణా జిల్లాలోని సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించి సువార్తను ప్రకటించారు.

    హెన్రీ యొక్క మిషనరీ పరిచర్య కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆ స్వల్ప వ్యవధి కూడా వివిధ కారణాల వలన పలుమార్లు భంగపరచబడింది. అనారోగ్యం కారణంగా అతను 1843-44 సంll ల మధ్య కొంతకాలం నీలగిరి కొండలలో నివసించవలసి వచ్చింది. 1845వ సంll లో అతని భార్య యొక్క అనారోగ్యం కారణంగా అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయితే, వారు మద్రాసులో సముద్రయానం ప్రారంభించిన కొద్ది సమయంలోనే అతను ఆమెను కోల్పోయారు. అతను తిరిగి భారతదేశానికి వచ్చినప్పటికీ, క్షీణించిన అతని ఆరోగ్యం 1848వ సంll లో మళ్ళీ అతనిని ఇంగ్లాండుకు తిరుగుముఖం పట్టించింది. చివరి వరకు కూడా దేవుని సేవించుటకు వెనుకంజవేయక ప్రయత్నించిన ఈ నమ్మకమైన దేవుని సేవకుడు, చివరకు 1848వ సంll అక్టోబరు మాసం 14వ తారీఖున తన తుది శ్వాస విడిచారు. అతని సేవ కేవలం పరిమిత కాలం మాత్రమే కొనసాగి, పలుమార్లు భంగపరచబడినప్పటికీ, ఒకే దృష్టిని కలిగియున్న హెన్రీ వాట్సన్ ఫాక్స్, తాను దేని నిమిత్తమై పిలువబడ్డారో ఆ గురి నుండి ఏనాడూ వైదొలగ దానిపైనే తన లక్ష్యముంచారు.

    ప్రియమైనవారలారా, ఏది ఏమైనా, ఏమి ఎదురైనా, ఒకే దృష్టితో ఒకే గురితో మీరు ముందుకు సాగెదరా?

    "ప్రభువా, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నీవే నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నావు. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 1, 2021

    Harry Schaeffer and Emma Sorgen | హ్యారీ షాఫెర్ మరియు ఎమ్మా సోర్గెన్

    హ్యారీ షాఫెర్ మరియు ఎమ్మా సోర్గెన్ |  Harry Schaeffer and Emma Sorgen


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం 

    ఎమ్మా సోర్గెన్ స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ నగరమైన బెర్నే నుండి పదిహేడు మైళ్ల దూరంలో జన్మించారు. ఆమెకు రెండు సంll ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళారు. తదుపరి ‘చర్చ్ ఆఫ్ క్రైస్ట్’ సంఘములో సభ్యురాలుగా చేరిన ఎమ్మా, తాను ఒక మిషనరీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆమె హీరామ్ కళాశాలలో చదువుకున్నారు మరియు చికాగోలోని పెస్టలోజీ-ఫ్రోబెల్ కిండర్‌గార్టెన్ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. పిమ్మట రెండేళ్ళపాటు అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె, ఆపై మిషనరీగా భారతదేశానికి వెళ్ళేందుకు సిద్ధపడుటకుగాను ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు.


    ఓహియోకు చెందిన హ్యారీ షాఫెర్ తన ఉన్నత విద్యను పూర్తిచేసుకొనిన పిమ్మట ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ కళాశాలలో చేరారు. అక్కడ అతను ఎమ్మా సోర్గెన్‌ను కలవడం జరిగింది. వారిరువురు కూడా భారతదేశానికి వెళ్ళుటకు ఎంతో అత్యాసక్తితో ఉన్నారు. 1913వ సంll జూన్ మాసంలో ఓహియోలోని కెంటన్‌లో వారిరువురికి వివాహం జరిగింది. అదే సంవత్సరం శరదృతువులో వారు భారతదేశానికి పయనమయ్యారు.


    భారతదేశంలో వారి మొదటి కొన్ని నెలలు లక్నోలోని యూనియన్ లాంగ్వేజ్ స్కూలులో గడిపారు. తరువాత వారు రథ్ ప్రాంతములోను, పిమ్మట పెండ్రా రోడ్‌లోను సువార్త పరిచర్యను జరిగించారు. వారు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళి గుడారాలలో నివసిస్తూ, అనేకమందికి సువార్తను ప్రకటించారు. కొంతకాలం సెలవు తీసుకొనిన పిమ్మట, 1920వ సంll ప్రాంతంలో, ఆ మిషనరీ దంపతులు బిలాస్‌పూర్‌కు తరలి వెళ్ళారు. అక్కడ షాఫెర్ స్థానిక సంఘము యొక్క బాధ్యతలను చేపట్టారు, గ్రామాలలో సువార్త పరిచర్యను మరియు బాలుర పాఠశాలలను పర్యవేక్షించారు మరియు ఆ పెద్ద మిషన్ స్టేషన్ యొక్క నిర్వాహక బాధ్యతలను కూడా చూసుకున్నారు. అంతేకాదు, ‘జాక్మన్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ (జాక్మన్ స్మారక ఆసుపత్రి మరియు నర్సుల శిక్షణ పాఠశాల) మరియు తరువాత బాలికల కొరకు ఏర్పరచబడిన ‘బర్గెస్ మెమోరియల్ హై స్కూల్’ (బర్గెస్ స్మారక ఉన్నత పాఠశాల) యొక్క భవన నిర్మాణాలను కూడా పర్యవేక్షించారు. 1926వ సంll లో వారి సెలవు దినములు ముగిసిన తరువాత, వేరొక సంస్థ తరపున కాక, వారు స్వతంత్ర మిషనరీలుగా భారతదేశానికి తిరిగి వచ్చి, బిలాస్‌పూర్‌లో ఉన్నారు.


    1946వ సంll ఏప్రిల్ మాసంలో కలకత్తా నగరంలో షాఫెర్ మరణించే వరకు కూడా వారు స్వతంత్య్రముగానే బిలాస్‌పూర్‌లో మిషనరీ సేవను కొనసాగించారు.

    ప్రియమైనవారలారా, మీ హృదయ వాంఛ ఏమిటి? దేవుని రాజ్యము కొరకు పని చేయవలెననా లేదా మీ స్వంత అవసరతల కొరకు పని చేయవలెననా? 


    "ప్రభువా, నేను ఉంచబడిన స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Sep 17, 2021

    Harry Ironside | హ్యారీ ఐరన్‌సైడ్

    హ్యారీ ఐరన్‌సైడ్ |  Harry Ironside


    • జననం: 1876
    • మహిమ ప్రవేశం: 1951
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

     హ్యారీ ఐరన్‌సైడ్ అమెరికాకు చెందిన ఒక బోధకుడు, బైబిలు వేదాంతవేత్త మరియు రచయిత. అతనికి 14 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను బైబిలును 14 సార్లు చదివారు మరియు బైబిలులోని అనేక వచనాలను కంఠస్థం చేశారు. అతనికి 10 సంll ల వయస్సు ఉన్నప్పుడు తన తల్లితో పాటు అతను లాస్ ఏంజిల్స్‌లో నివసించుటకు వెళ్ళారు. అక్కడ వారి ఇంటికి సమీపంలో ఆదివారపు బైబిలు పాఠశాల (సండే స్కూల్) లేదు. కావున ఐరన్‌సైడ్ ఆ ప్రాంతంలోని పిల్లలను సమకూర్చి తానే స్వయంగా వారికి బైబిలు కథలను చెప్పేవారు. కాలక్రమేణా ఆ సండే స్కూలులో పిల్లల సంఖ్య అరవైకి చేరుకుంది. కొన్నిసార్లు పెద్దలు కూడా అక్కడ హాజరయ్యేవారు.

    ఐరన్‌సైడ్ ఒకవైపు పరిచర్య చేస్తున్నప్పటికీ అతను ఒక మతపరమైన వ్యక్తిగా ఉన్నారే గానీ, క్రీస్తును కలిగిలేరు. ఒక రోజు ఒక సంచార సువార్తికుడు “నీవు తిరిగి జన్మించావా?” అని అతనిని సూటిగా అడిగిన ప్రశ్నకు అతని వద్ద సమాధానం లేదు. అప్పుడు అతను రక్షించబడకుండా దేవుని గురించి బోధించుటకు నోరు తెరిచే హక్కు తనకు లేదని గ్రహించారు. ఒక రోజు రాత్రి అతను సామెతలు 1: 24-32 చదువుతున్నప్పుడు, అతను మోకరించి "ప్రభువా, నన్ను రక్షించుము!" అని ప్రార్థించారు. ఆ అనుభవం తర్వాత యవ్వనస్థుడైన ఐరన్‌సైడ్ నిర్మలమైన మనస్సాక్షితో రక్షణ సైన్యముతో (‘సాల్వేషన్ ఆర్మీ’) కలిసి తన పరిచర్యను ప్రారంభించారు. 18 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను సంవత్సరానికి 500 కంటే ఎక్కువ ప్రసంగాలనిచ్చే బోధకుడయ్యారు.

    హెలెన్ స్కోఫీల్డ్‌తో వివాహం జరిగిన తరువాత ఐరన్‌సైడ్ ఓక్లాండ్‌కు వెళ్ళారు. అది చాలా సంవత్సరాల పాటు వారి పరిచర్యకు కేంద్రంగా ఉంది. అక్కడ పరిచర్య కొరకు ద్వారములు తెరిచి ఉన్నాయి. అదే సమయంలో దేవుడు వారిని కొన్ని కఠినమైన పరిస్థితులు మరియు వారి విశ్వాసమునకు కలిగిన పరీక్షల గుండా నడిపించాడు. అనేక సార్లు ఆ చిన్న కుటుంబం ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఉండేది. ఒకసారి వారు మిన్నెసోటాలో పరిచర్య జరిగించి తిరిగి వస్తున్నప్పుడు, ఓక్లాండ్ చేరుకోవడానికి వారి యొద్ద ధనము లేదు మరియు ఎటువంటి సహాయమూ అందలేదు. కావున వారు ఉటా అనే ప్రాంతము వద్ద ఆగిపోవలసి వచ్చింది. తన పిల్లలకు ఆహారమిచ్చుటకు మరియు అద్దె చెల్లించుటకు కావలసిన 40 సెంట్లు (సుమారు 1.50 రూపాయలు) కూడా అతని వద్ద లేని స్థితి వచ్చింది. ఆ రాత్రి అతను ఆరుబయట ఒక పెద్ద జన సమూహానికి బోధించి, నిరుత్సాహపడుతూ తిరిగి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతని యొద్దకు పరుగెత్తుకు వచ్చి, కొన్ని నాణములు ఇచ్చి, వెళ్ళిపోయారు. అతను వాటిని లెక్కించగా అవి ఖచ్చితంగా 40 సెంట్లు ఉన్నాయి! దేవుడు నమ్మదగినవాడు!

    ఐరన్‌సైడ్ 1930వ సంll నుండి 1948వ సంll వరకు చికాగోలోని మూడీ చర్చిలో పాదిరిగా సేవలందించారు. అదే సమయంలో అతను అమెరికా అంతటనూ మరియు ప్రపంచవ్యాప్తంగాను పర్యటించి ప్రసంగిస్తూనే ఉన్నారు. అనేక శారీరక రుగ్మతలను ఎదుర్కొంటున్నప్పటికీ వెనుకంజ వేయక పరిచర్యను కొనసాగించి దేవుని సేవలో ముందుకు సాగిపోయిన హ్యారీ ఐరన్‌సైడ్, పరిచర్య నిమిత్తం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సమయంలో తనువు చాలించారు.

    🚸 *ప్రియమైనవారలారా, మీరు క్రీస్తును కలిగియున్నారా లేక మతపరమైన వ్యక్తిగా ఉన్నారా?* 🚸

    🛐 *"ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు! నీ విశ్వాస్యతకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను కూడా నీకు నమ్మకముగా జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
    *******
    *******
    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
    *******
  • WhatsApp
  • Sep 15, 2021

    Harold St. John | హెరాల్డ్ సెయింట్ జాన్

    హెరాల్డ్ సెయింట్ జాన్ | Harold St. John

    • జననం: 02-09-1876
    • మహిమ ప్రవేశం: 11-05-1957
    • స్వదేశం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: ప్రపంచవ్యాప్తంగా

    అతని కాలంలో అత్యంత ప్రతిభావంతులైన బైబిలు ఉపదేశకులలో ఒకరు హెరాల్డ్ సెయింట్ జాన్. దేవుని యందలి భయభక్తులతో పెరిగిన అతను, 18 సంll ల వయస్సులో క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి కూడా అతను తాను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ సువార్త చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో చదువుకోవాలని అతను ఆకాంక్షించారు గానీ, తన తండ్రి యొక్క అకాల మరణం కారణంగా దానిని సాధించలేకపోయారు. తదుపరి అతను లండన్‌లోని ఒక బ్యాంకులో పని చేయడం ప్రారంభించారు. అక్కడ పని చేయు వేళలు సుదీర్ఘముగా ఉన్నప్పటికీ, అతను తన ఖాళీ సమయాన్ని సువార్త ప్రకటించుటకు కేటాయించేవారు.

    ఈస్ట్ లండన్ మరియు హైడ్ పార్క్‌లలో బోధించారు హెరాల్డ్. అయితే అతని ఆసక్తి ముఖ్యముగా మురికివాడలలో పరిచర్య చేయడం పట్ల ఉండెడిది. కానీ తన బోధనల ద్వారా ప్రజలు ఒప్పింపబడుటలేదనియు మరియు వారి నుండి అంతగా స్పందన లేదనియు అతను భావించారు. దానికి కారణం తాను పట్టు వస్త్రాలు ధరించి, క్రీస్తు యొక్క శ్రమలను గురించి బోధిస్తే ఎవరూ తన మాటలను ఆలకించరని  గ్రహించారు హెరాల్డ్. కావున, ఒకనాటి సాయంత్రం అతను చౌకైన దుస్తులు ధరించి, దాదాపు 200 మంది నివసించే ఒక మురికివాడకు వెళ్ళారు. వారు కూర్చున్న చోట అతను కూర్చున్నారు, వారు తినేదే అతను కూడా తిన్నారు మరియు వారిని కుట్టిన మిన్నల్లి పురుగులు అతనిని కూడా కుట్టాయి. అతను ఆ రాత్రంతా వారి అవసరాలను, బాధలను వింటూ వారితో గడిపారు. పిమ్మట ఒకనాడు ఉదయం ఆరు గంటలకు అతను లేచి వారితో మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పుడు అతని బోధనను వినిన ప్రజలు అతను చెప్పినదానిని అంగీకరిస్తున్నట్లు కనిపించింది. ఆ రోజున లండన్ నగర మురికివాడలలో ఒక ఆత్మీయ ఉజ్జీవం ప్రారంభమైంది.

    మంచి జీతం వస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన పూర్తి సమయమును పరిచర్యకు సమర్పించుకున్నారు హెరాల్డ్. అటువంటి పరిచర్యనే తరువాతి 30 సంll ల పాటు కొనసాగించిన అతను, క్రీస్తు కొరకు వేలాది ఆత్మలను సంపాదించారు. అతను తన భార్యతో పాటు బ్రెజిల్, బొలీవియా, పెరాగ్వే, ఉరుగ్వే మరియు అర్జెంటీనా మొదలగు దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆత్మలో శక్తివంతమైన అభిషేకమును పొందుకొనినవారై, తాను వెళ్ళిన ప్రతి ప్రదేశములోను పెద్దసంఖ్యలో జన సమూహాలను ఆకర్షించారు హెరాల్డ్. అతను తన జీవితాంతం కూడా సంచార మిషనరీగా దేవుని కొరకై జీవించారు.

    “నేను రాజును చూచుటకు వెళ్ళినప్పుడు అది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది... తన సౌందర్యముతో ఉన్న రాజు... నా పాపాలు, నా భయాలు అన్నీ, సమస్తమూ పోయాయి... ఇప్పుడు క్రీస్తు మాత్రమే... నేను జీవించి ఉన్నవారిలో సంతోషకరమైన వ్యక్తిని... అది అంతా ప్రకాశవంతంగా ఉంది, అంతా ప్రకాశవంతంగా ఉంది!” అను మాటలు తాను మరణించబోయే ముందు హెరాల్డ్ సెయింట్ జాన్ మెల్లని స్వరముతో పలికిన మాటలు. 

    🚸 *ప్రియమైనవారలారా, మీ జీవనశైలి క్రీస్తు యొక్క శ్రమలను సూచించేదిగా ఉన్నదా?* 🚸

    🛐 *"ప్రభువా, వాక్యమును బోధించుటకు ముందు నేను దానిని పాటించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

    *******
    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp
  • Sep 8, 2021

    Hunter Corbett | హంటర్ కార్బెట్

    హంటర్ కార్బెట్ | Hunter Corbett

    • జననం: 08-12-1835
    • మహిమ ప్రవేశం: 07-01-1920
    • స్వస్థలం: పెన్సిల్వేనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా


      అమెరికాకు చెందిన హంటర్ కార్బెట్ చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో సేవ చేసిన ప్రారంభక మిషనరీలలో ఒకరిగాను, మార్గదర్శకులుగాను నిలిచారు. ‘ప్రిన్స్‌టన్ థియోలాజికల్ సెమినరీ’ లో బైబిలు వేదాంతశాస్త్రమును అభ్యసించిన అతను, పట్టభద్రులైన తరువాత దేవుని సేవ చేయుటకు తన భార్యతో కలిసి చైనాకు వెళ్ళారు. ప్రమాదకరమైనదిగా ఉన్న ఆ ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఓడ పగిలిపోయింది కూడా. ఏమైతేనేమి, చివరకు వారు 1865వ సంll లో చెఫూకు చేరుకొనగలిగారు.


     అతను సువార్త సేవను ప్రారంభించగా, అతని జీవితం సానుకూలంగా సాగిపోలేదు కానీ, శ్రమలను అనుభవించుటకు తగినట్లుగా ఉంది. అతను నగరాలలో ఒకే ప్రాంతములో కేంద్రీకృతమై ఉండే పరిచర్య కంటే ఉత్తర చైనాలోని గ్రామాలకు ప్రయాణిస్తూ సమగ్ర సంచార సేవను చేయటం మరింత ప్రయోజనకరమని విశ్వసించారు. అతను తన మొట్టమొదటి సువార్త పర్యటనలో వాంగ్ జీ అనే ఒక చైనా పండితుడిని కలుసుకున్నారు. వాంగ్ జీ కఠినమైన మరియు అహంకారము కలిగిన ప్రవర్తనను కలిగియున్నవారు. కానీ, కార్బెట్ యొక్క బోధన అతనిలో సత్యం కొరకైన గొప్ప ఆకాంక్షను రేకెత్తించింది. కాగా అతను కార్బెట్‌తో కలిసి తీవ్రముగా బైబిలును అధ్యయనం చేయుటకు ఎంతో సమయమును గడిపారు. త్వరలోనే అతను బాప్తిస్మం కూడా తీసుకున్నారు. వాంగ్ జీ యొక్క జీవితం మరియు అతని వైఖరిలో కలిగిన మార్పును చూసి ఆశ్చర్యపోయిన అతని భార్య కూడా తరువాత క్రీస్తును అంగీకరించారు. ఆ విధంగా దేవునిలోకి నడిపించబడిన వాంగ్ జీ దంపతులు క్రమేణా చైనాలో తదుపరి పరిచర్యకు పునాదులుగా మారారు.

     

      కార్బెట్ యొక్క విజయవంతమైన పరిచర్యతో పాటు శ్రమలు శోధనలు కూడా ఎదురయ్యాయి. ఊహించని పరిణామంలో, అతను పిల్లలను అపహరించారని మరియు తిరుగుబాటును లేవనెత్తుటకు పథకం వేశారని వదంతులు వ్యాపించాయి. తద్వారా ప్రజలు అకస్మాత్తుగా అతనికి శతృవులుగా మారారు మరియు అతను ఎక్కడికి వెళ్ళినా అతనిని రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. అయితే, అద్భుతరీతిలో అతను అనేకసార్లు మరణం నుండి తప్పించుకున్నారు. ఒకసారి అతను సువార్త యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పటికి అతని ఇల్లు ధ్వంసం చేయబడివుంది. ఏదేమైనప్పటికీ, శ్రమలన్నింటిలోనూ దేవుడు కార్బెట్ యొక్క బలము మరియు కేడెమునై ఉన్నాడు.


     సువార్తను ప్రకటించుటకు తాను అనుసరించే అసాధారణ పద్ధతులకు పేరుగాంచారు కార్బెట్. సువార్త వినుటకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని గ్రహించిన అతను, ఒక నాటకశాలను (థియేటర్‌ను) అద్దెకు తీసుకొని, దానిలో కొంత భాగాన్ని సంగ్రహాలయముగా (మ్యూజియంగా) మార్చారు. కాగా, సంగ్రహాలయమును చూచుటకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మొదటి గదిలో సువార్త అందించబడిన తరువాతనే వారు ప్రదర్శించబడినవాటిని వీక్షించుటకు అనుమతించబడ్డారు. ఇటువంటి పద్ధతులు మంచి లాభకారముగా ఉన్నాయి. అతను షాండాంగ్ మిషన్‌ను కూడా స్థాపించగా, 1895వ సంll నాటికి ఆ మిషన్ క్రింద దాదాపు 63 మిషనరీలు మరియు 36 సంఘములు ఉన్నాయి. 1920వ సంll లో అతను మరణించే నాటికి, కార్బెట్ చేతుల మీదుగా బాప్తిస్మము పొందిన చైనా విశ్వాసులు 3,000 మందికి పైగా ఉన్నారు మరియు షాండాంగ్ ప్రావిన్స్ అంతటా దాదాపు 343 క్రైస్తవ సంఘములు స్థాపించబడి ఉన్నాయి!


    🚸 *ప్రియమైనవారలారా, క్రైస్తవ నీతినిజాయితీలను ఏమాత్రం విడువక, శ్రమలను భరించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, నా శ్రమలన్నింటిలో మీరు నా బలము మరియు కేడెమునై యున్నందుకు మీకుకృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమేన్!"* 🛐

    *******


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Sep 6, 2021

    William Buck Bagby | విలియం బక్ బాగ్బీ

    విలియం బక్ బాగ్బీ | William Buck Bagby

    • జననం: 05-011-1855
    • మహిమ ప్రవేశం: 05-08-1939
    • స్వస్థలం: కొరియెల్ కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్


     1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.


     వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.


     బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.


     58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ. 


    🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp